నవతెలంగాణ - టర్కీ
టర్కీ - సిరియాలో భూకంపం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భవనాలన్నీ పేకమేడల్లా కూలిపోయాయి. సోమవారం తెల్లవారుజామున రెండు దేశాలలో 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను సైతం నేలమట్టం చేసింది. ఆసుపత్రులను ధ్వంసం చేసింది. వేలకొద్ది ప్రజానీకం భూ సమాధి అయ్యింది. వేలాది మంది ప్రజానీకం నిరాశ్రయులయ్యారు. వేలాది మంది గాయపడ్డారు. హుటాహుటిన రెస్క్యూ బృందాలు అక్కడకు చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే నేటి (మంగళవారం) ఉదయం మరోమారు సెంట్రల్ టర్కీలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Mon Jan 19, 2015 06:51 pm