నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్ తయారీ విధానం మారాలని, లేకపోతే ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశం పేదలు, సంపన్నుల భారత్గా విడిపోయిందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్లో ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డీ పాపారావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1920-30లో ఒకశాతం ప్రజల చేతుల్లో 20శాతం సంపద ఉండేదన్నారు. 1990 నుంచి ప్రపంచీకరణ నేపథ్యంలో అసమానతలు ప్రారంభమై ఒక శాతం చేతిలో 40 శాతం, 10 శాతం చేతిలో 80 శాతం సంపద పెరిగిపోయిందన్నారు. ఉత్పాదక, మౌలిక రంగాలపై ఆధారపడాల్సిన ఆర్థిక వ్యవస్థ కేవలం స్టాక్స్, షేర్స్పై ఆధారపడి స్పెక్యులేషన్ (సట్ట వ్యాపారం)తో కృత్రిమ సంపదగా, జూదంలా తయారైందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm