నవతెలంగాణ-హైదరాబాద్ : ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ బేటి కానుంది. మోడల్ స్కూళ్లలో ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు, జిందాల్ స్టీల్ కు రామాయపట్నం పోర్టులో క్యాప్టివ్ బెర్త్ కేటాయింపు ప్రతిపాదనలు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అటు కళ్యాణమస్తు షాదీతోఫా పథకం ఆర్థిక సాయం ఈనెల 10 న ప్రభుత్వం విడుదల చేయనుంది. సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. గతేడాది అక్టోబర్ 1 నుంచి 31 మధ్యాహ్నం మ్యారేజ్ చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతలకు ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. దీనిపై కూడా జగన్ మోహన్ రెడ్డి కీలక అదేశాలు చేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm