నవతెలంగాణ-హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా జిన్నారంలో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గడ్డపోతారం పారిశ్రామికవాడలోని లీ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో కార్మికులు, ఉద్యోగులు పరుగులు తీశారు. కార్మికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.
Mon Jan 19, 2015 06:51 pm