- ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
నవతెలంగాణ - జగిత్యాల
జిల్లాలోని కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్ల నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో దేవాలయాల అభివృద్ధికి చిన్నచూపు చూశారని మండిపడ్దారు. కొండగట్టుకు నిధులు మంజూరికి కృషి చేసిన మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm