- వాగులో ఈత కు వెళ్ళి ఇరువురు మృతి...
- పండుగ పూట రెండు కుటుంబాల్లో విషాదం...
- విచారణ చేపట్టిన ఎస్.ఐ రామ్మూర్తి...
నవతెలంగాణ - అశ్వారావుపేట:
పండుగ సరదా ప్రాణం తీసింది.వాగులో ఈత కు వెళ్ళిన ఆరుగురిలో ఇరువురు యువకులు మృత్యువాత పడ్డారు.దీంతో ఒకే ఊరిలో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట మండలం,కొత్తమామిళ్ళ వారిగూడెం కు చెందిన కవులూరి బజారు కుమారుడు సాయి(18), కొక్కెరపాటి స్వర్ణ కుమారుడు ప్రవీణ్ (16),మరో నలుగురు సిద్దెల సత్తిపండు ,సిద్దెల కనకేసు,కాటూరి చిలకారావు,దూదిగం ఈశ్వర్ లు ఆదివారం కనుమ కావడంతో సరదాగా ఈత కొడదామని అశ్వారావుపేట మండలం,దిబ్బగూడెం పంచాయితీ పరిధిలో గల గాడ్రాల వాగులో కి వెళ్ళారు.ఈ క్రమంలో సాయి,ప్రవీణ్ లు వాగులో గల్లంతై మృత్యువాత పడ్డారు.వెంట ఉన్న యువకులు కొత్తమామిళ్ళవారిగూడె సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు వెళ్ళి గాలించారు.అప్పటికే మృతి చెంది ఉన్నారు.మృత దేహాలను గ్రామానికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్.ఐ రామ్మూర్తి మృతుల గ్రామానికి వెళ్ళి సంఘటనకు దారి తీసిన పరిస్థితులను విచారించారు. ఇంకా మృతుల కుటుంబాల నుండి పిర్యాదు అందలేదని తెలిపారు.