- ఎస్ఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ కి వినతి
నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్రంలో కరోణ తీవ్రత రీత్యా బీడీఎస్ పరీక్షలు వాయిదా వేయాలి అని అని కోరుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ రూరల్ పరిధిలో మల్లారం గ్రామంలోని మేఘన డెంటల్ కళశాల ప్రిన్సిపాల్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతున్న రీత్యా తెలంగాణ ప్రభుత్వం ముందు నుండి కఠినమైన చర్యలు తీసుకుంటు, కరోనా భారీన విద్యార్థులు పడకూడదని విద్యాసంస్థలకు ముందే సెలవులు ప్రకటించింది అని అన్నారు. కానీ కాళోజీ నారయణరావు హెల్త్ యూనివర్శీటీ పరిధిలోని డెంటల్ విద్యార్ధులకు ఈ నెల 19 నుండి పరీక్షల షెడ్యుల్ ఇచ్చారు.
ఇప్పటికే చాలామంది విద్యార్థులు మరియు ప్రోఫెసర్స్ కూడా కరోనా భారీన పడ్డారు.అలాగే ఆన్ లైన్ తరగతులు కూడా సరిగ్గా జరగని తరుణంలో పరీక్షలు ఏ రకంగా రాస్తారో ప్రభుత్వమే చెప్పాలి అని ప్రశ్నించారు. అదే విధంగా ఫైనలియర్ విధ్యార్దులు కరోనా కారణంగా ఏవరైనా హజరు కాకుంటే మళ్ళీ సప్లిమెంటరీ పరీక్షలు ఉండవు కాబ్బటి 6 నెలలు ఖాళీగా ఉంటారు. ఎండిఎస్ (పిజీ)రాయడానికి అవకాశం ఉండదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బిడిఎస్ పరీక్షలను విద్యార్థుల ఆరోగ్యాన్నీ&భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే వాయిదా వేసేలాగా యూనివర్సిటీ హెల్త్ డైరెక్టర్ స్పందించాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నగర నాయకులు అషిఫ్, గణేష్ , విష్ణు వర్ధన్,సాయి,రాహుల్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 17 Jan,2022 06:01PM