- హాజరైన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- మండలి రూల్స్ బుక్స్, ఐడి కార్డు అందించి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి
నవతెలంగాణ కంటేశ్వర్
శాసనమండలి సభ్యులు కల్వకుంట్ల కవిత, కూచుకుల్ల దామోదర్ రెడ్డి బుధవారం ఎమ్మెల్సీలు గా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ప్రొటెం చైర్మన్ అమిణుల్ హసన్ జాఫ్రి వారితో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలు కవిత, దామోదర్ రెడ్డి లకు మంత్రి మండలి రూల్స్ బుక్స్, ఐడి కార్డు అందజేశారు. అనంతరం పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు బీబీ పాటిల్, కే ఆర్ సురేష్ రెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, షకీల్ మహ్మద్, సంజయ్ కుమార్, ఎమ్మెల్సీలు గంగాధర్ గౌడ్, ఫారూఖ్ హుస్సేన్, బానుప్రసాదరావు, ఎమ్.ఎస్ ప్రభాకర్ రావు, ఎల్.రమణ, అసెంబ్లీ కార్యదర్శి డా.నర్సింహా చార్యులు, మాజీ ఎమ్మెల్సీలు శ్రీనివాసరెడ్డి, నారదాసు లక్ష్మణ్, జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 19 Jan,2022 03:13PM