నవతెలంగాణ- తాడ్వాయి
మేడారం సమ్మక్క సారలమ్మ లను పలువురు ప్రముఖులు శుక్రవారం దర్శించుకున్నారు. బీజాపూర్ ఎంపీ దీపక్ బైజూ, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డిలు కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకున్నారు. వీరికి పూజారులు ఆదివాసి సాంప్రదాయం ప్రకారం డోలు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గద్దెల వద్దకు స్వాగతం పలికారు. అనంతరం తల్లులకు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నూతన వస్త్రాలు, కొబ్బరికాయలు, బెల్లం, సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నిలువెత్తు బంగారం వన దేవతల కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2022 07:02PM