నవతెలంగాణ - సిద్ధిపేట
పట్టణంలో అంబేద్కర్ నగర్ వద్ద ద్విచక్ర వాహనాల సర్వీసింగ్ సెంటర్ వద్ద దుకాణదారులు చెట్లు నరికాగా, వారికి మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి రెండు చెట్లకు గాను 20,000 జరిమానా విధించారు. అలాగే 40 మొక్కలు నాటాలని ఆదేశించారు. అలాగే శనివారం ఉదయం చెట్లు నరికిన చోటే ఆయన మొక్కను నాటారు. మరోసారి ఎవరైనా చెట్లను నరికితే పోలీస్ ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సాకి ఆనంద్ , మునిసిపల్ అధికారులు మల్లికార్జున్, ఐలయ్య పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm