Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొవిడ్ ను ఎదుర్కొనేందుకు సర్వం సన్నద్ధం : మంత్రి వేముల| Mofussil |Telangana Roundup| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తెలంగాణ రౌండప్
  • ➲
  • స్టోరి
  • 22 Jan,2022 06:19PM

కొవిడ్ ను ఎదుర్కొనేందుకు సర్వం సన్నద్ధం : మంత్రి వేముల

- కొవిడ్ ను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంద్ధం
- భయాందోళనలకు లోను కావద్దని... ప్రజలకు హితవు
- దళిత బంధు అమలులో జిల్లాను ఆదర్శంగా నిలపాలి
నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
ఒమీక్రాన్ వ్యాప్తితో కొవిడ్ కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో, దీనిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సన్నద్ధం అయ్యి ఉన్నదని రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి భరోసా కల్పించారు. ప్రజలు అనవసర భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, గుంపులు గుంపులుగా తిరుగకుండా, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించి తమ దైనందిన పనులు చేసుకోవాలని ఆయన సూచించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిలా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నిజామాబాదు అర్బన్ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డిలతో కలిసి కొవిడ్ నియంత్రణ చర్యలు, దళిత బంధు అమలు కార్యాచరణ రూపకల్పన తదితర అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. వీటి అమలులో పాటించాల్సిన పద్ధతులు, సాధించాల్సిన లక్ష్యాల గురించి మంత్రి వేముల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కొవిడ్ సెకండ్ వేరియంట్ సమయంలో ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లా యంత్రాంగం ఎంతో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించిందని ప్రశంసించారు. ముఖ్యంగా పోలీస్, వైద్యారోగ్య, రెవిన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది కష్టపడి పని చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం అదే స్పూర్తితో ఇంటింటి సర్వే, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి ఒమీక్రాన్ వ్యాప్తిని కట్టడి చేయాలని సూచించారు. ఇంటింటి ఆరోగ్యం సర్వే ఎంత పక్కాగా జరిగితే అంతే చక్కటి ఫలితాలను సాధించవచ్చని మంత్రి పేర్కొన్నారు. సర్వేలో పోలీస్ శాఖ తరఫున కానిస్టేబుల్స్ ను కూడా భాగస్వాములు చేయాలని పోలీస్ కమిషనర్ నాగరాజు కు సూచించారు. సర్వే సమయంలో ఎంత మంది జ్వరంతో బాధపడుతున్నారు, జ్వరంతో పాటు దగ్గు, జలుబు, తలనొప్పి, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు సైతం ఎంతమందికి ఉన్నాయన్నది నిర్ధారించాలని అన్నారు. పై అన్ని లక్షణాలు ఉన్న వారికి హోమ్ ఐసోలేషన్ మెడికల్ కిట్ ను అందజేయాలన్నారు. మందులు వాడినప్పటికీ ఇంకనూ అవే లక్షణాలతో బాధపడుతున్న వారిని సమీప ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయి, ఎంత మంది పేషంట్లకు అవి సరిపోతాయన్నది ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలని హితవు పలికారు. జిల్లాలో తొలిరోజున దాదాపు లక్ష ఇండ్లలో సర్వే చేస్తే 1900 మందికి జ్వరం, జలుబు వంటి లక్షణాలు గుర్తించారని అన్నారు. అంటే ఈ లెక్కన జిల్లాలో సుమారు 6 వేల మందిలో జ్వరం తదితర లక్షణాలు బయటపడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ప్రజలు కొన్ని రోజుల పాటు విందులు, వినోదాలకు దూరంగా ఉంటేనే మంచిదని మంత్రి హితవు పలికారు. కొవిడ్ టీకాలను అర్హులైన వారందరు తప్పనిసరిగా తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొవిడ్ సోకినా అంతగా ఇబ్బందులు ఎదురవ్వడం లేదనే విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు టీకాలు తీసుకోవాలని అన్నారు. ఇదిలా ఉండగా, దళితబంధు దేశంలోనే ఎంతో మహత్తరమైన కార్యక్రమమని, దీనిని సమర్ధవంతంగా అమలు చేసి నిజామాబాదు జిల్లాను ఆదర్శంగా నిలపాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను కోరారు. సమాజంలో అట్టడుగున ఉన్న దళిత కుటుంబాలకు చేయూతను అందించి వారు కూడా ఆర్ధిక పరిపుష్టి సాధించి గౌరవంగ జీవనాలు వెళ్లదీయాలనే ఉదాత్తమైన ఆశయంతోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దళిత బంధు కార్యక్రమానికి రూపకల్పన చేశారని చెప్పారు. ఇప్పటికే హుజుర్ నగర్ నియోజక వర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో వంద మంది చొప్పున లబ్ధిదారులకు దళిత బందును అమలు చేయాలని సంకల్పించారని, వచ్చే మర్చి నెల నుండే దీనిని అమలు చేసే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా, వివిధ శాఖల ఆధ్వర్యంలో యూనిట్ల స్థాపనకై సమగ్ర ప్రణాళికతో వారం రోజుల్లోపు నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిదుల సహకారం తీసుకుంటూ, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా దళిత బంధు అమలయ్యేలా చొరవ చూపాలన్నారు. యూనిట్ విలువ రూ. పది లక్షల వరకే ఉండాలనే నిబంధన ఏది లేదని, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన యూనిట్లను గుర్తిస్తే లబ్దిదారులను గ్రూపులుగా ఏర్పాటు చేసి వారికి వర్తింపజేయవచ్చని సూచించారు. ఎస్సి కార్పొరేషన్, సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖలతో పాటు వ్యవసాయ, పరిశ్రమలు, డెయిరీ, ఉద్యానవన తదితర శాఖల ఆధ్వర్యంలోనూ దళిత బంధు యూనిట్ల స్థాపనకు కృషి చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో నియోజకవర్గ శాసన సభ్యులు క్రియాశీలకంగా వ్యవహరిస్తారని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
     కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ఇంటింటి ఆరోగ్యం సర్వే సమర్ధవంతంగా జరుగుతోందని మంత్రి వేములకు వివరించారు. జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారికి వెంటనే హోమ్ ఐసోలేషన్ మెడికల్ కిట్ లను అందజేసి, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి గురించి పర్యవేక్షణ జరిపిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే క్షేత్ర స్థాయి వరకు మొత్తం 3.60 లక్షల మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచామని అన్నారు. ఓ వైపు సర్వేను పకడ్బందీగా జరిపిస్తూనే వ్యాక్సినేషన్ ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తి చేసేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ లక్ష్య సాధన కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడతామని చెప్పారు. పీ హెచ్ సీలు, సి హెచ్ సీలలో శుక్రవారం నాటి నుండే కొవిడ్ అవుట్ పేషంట్ విభాగాలను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ కు పూర్తి స్థాయిలో చికిత్స అందుతోందని నమ్మకాన్ని ప్రజలకు కల్పిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెయ్యి పడకలు ఉన్నాయని, ప్రయివేట్ ఆసుపత్రుల్లో మరో 2200 వరకు బెడ్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంచామని, మాక్లూర్ లో ఐసోలేషన్ సెంటర్ ను సిద్ధం చేశామని వెల్లడించారు. దళిత బంధు అమలు కోసం ఇప్పటికే ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపి స్పష్టమైన సూచనలు ఇచ్చామని తెలిపారు. ఒక్కో శాఖా వారీగా యూనిట్ల స్థాపన కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. సమీక్ష సమావేశంలో నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కొవిడ్ ను ఎదుర్కొనేందుకు సర్వం సన్నద్ధం : మంత్రి వేముల
కొవిడ్ ను ఎదుర్కొనేందుకు సర్వం సన్నద్ధం : మంత్రి వేముల
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తెలంగాణ రౌండప్

05:02 PM హిమాలయా నుంచి సానిటైజ్ చేసే ఫ్లోర్ క్లీనర్
04:26 PM మన ఊరు మన బడి పునరుద్దరణ ప్రారంభం...
04:24 PM డిచ్ పల్లి మండలంలో జిలుగు విత్తనాలు అందుబాటులోకి..
04:15 PM హమాలి కార్మికుడి కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం ప్రకటించాలి..
04:14 PM ఆటో, క్యాబ్ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
04:07 PM బీజేపీలో చేరిన బండారు చంద్రశేఖర్
04:03 PM అదనపు కలెక్టర్, డిపిఆర్వో లకు జర్నలిస్టుల వినతి పత్రాలు
04:02 PM హమాలీల కోసం రక్తపోటు పరీక్ష శిబిరం ఏర్పాటు, అవగాహన
03:52 PM 16 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
03:50 PM సీఎంఆర్ఎఫ్ చెక్కులని పంపిణీ చేసిన ఎమ్మెల్యే
03:47 PM అభివృద్ధి పనులని పరిశీలించిన ఎమ్మెల్యే
03:44 PM గాయం వెంకట్ రెడ్డి మృతి పట్ల మంత్రి జగదీష్ రెడ్డి సంతాపం
07:57 PM నాట్రాక్స్‌ (NATRAX) వద్ద అత్యంత వేగవంతమైన భారతీయునిగా టైటిల్‌ అందుకున్న సీన్‌ రోజర్స్‌
07:00 PM సమత మమతలను పంచిన మహానీయుడు బుద్దుడు..
06:59 PM బైక్ పై నుండి పడి వీఆర్ఏ, ఆశ లకు గాయాలు
06:57 PM వాటర్ ప్లాంట్ యజమాన్యానికి నోటీసులు జారీ
06:52 PM పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు సన్మానించిన సీఐ, ఎస్ఐ
06:47 PM 'పది` పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
06:31 PM సఫాయి కర్మచారులు కాదు,వారు సఫాయి కర్మయోగులు...
06:19 PM మంథనిలో ఘనంగా జెడ్పీ చైర్మన్ జన్మదిన వేడుకలు...
06:17 PM చీకటి పాలనపై చర్చ జరగాలి
06:09 PM కల్తీకల్లు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి
06:05 PM నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలి..
06:03 PM ప్రశాంతంగా కొనసాగుతున్న పీజీ పరీక్షలు..
05:59 PM గ్రామీణ ప్రాంతాల అభివృద్దే టీఆర్ఎస్ లక్ష్యం
05:56 PM సహాయనిధిని సద్వినియోగించుకోవాలి
05:53 PM పద్మ అవార్డుల కొరకు దరఖాస్తుల ఆహ్వానం
05:51 PM ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
05:48 PM వివాహిత అదృశ్యం
05:44 PM ఫేన్సింగ్ వైర్ ఎత్తుకెళ్లిన దొంగలు
05:34 PM ఎంపీ ధర్మపురి అరవింద్ దిష్టిబొమ్మ దగ్ధం
05:32 PM ఈ నెల 19న ఆటో, క్యాబ్ ల బంద్
05:29 PM పంచాయతీ సిబ్బంది పిఆర్సి తరహా వేతనాలు పెంచాలి
05:23 PM మిట్టపల్లి లో ఘనంగా గంగమ్మ జాతర.
05:22 PM కనీస వేతనాలు అమలు చేయాలి - ఐఎఫ్ టియు
05:18 PM ఎంపీడీఓ కు కార్యదర్శుల సన్మానం...
04:58 PM అడ్డు అదుపులేని మద్యం వ్యాపారుల బెల్టు దందా!
04:50 PM ప్రతీ వరి ధాన్యం గింజను కోనుగోలు చేస్తాం..
04:19 PM ఫ్రీసర్ మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే బీగాల
04:15 PM పద్మ శాలి కల్యాణ మండపం పనులని పరిశీలించిన ఎమ్మెల్యే
03:30 PM వాహనదారులకు ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ అవగాహన
03:27 PM ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి
11:21 AM పేదల బిడ్డడు పండుగ సాయన్న
07:33 PM నిలబడ్డ వ్యక్తి ని డీకొన్న గుర్తుతెలియని వాహనం..
07:32 PM తెలంగాణ యూనివర్సిటీ హనుమాన్ జన్మోత్సవ కమిటీ..
07:32 PM అన్నదాతలు అధైర్యపడవద్దు ధాన్యం కొనుగోలు చేస్తాం
07:31 PM ఘనంగా రాయపోల్ ఎస్ఐ జన్మదిన వేడుకలు
07:31 PM కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ
06:10 PM వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ
04:44 PM హెల్త్ స్కీమ్ ని పటిష్ట పరచాలి!
04:35 PM రిటైర్డ్ ఆర్మీ జవాన్ కు మిత్రుల సన్మానం..
04:31 PM గోసంగిలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
04:28 PM రైతులకు అందుబాటులో జీలుగ విత్తనాలు
08:40 PM టి.ఎ.సి సభ్యడుగా ఎంపికైన 'బిర్రం' కు సన్మానం
07:30 PM రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ పోలిన గింజలు...?
07:29 PM విధుల్లో చేరిన సిఐ బాలక్రిష్ణ
06:48 PM 14 వ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా డక్కు నాయక్
06:35 PM స్వేరోస్ జిల్లా కో ఆర్డినేటర్ గా ఉప్పులేటి బాబు..
06:34 PM అంతరాష్ట్ర దొంగ అరెస్టు..
06:33 PM నిరుపేద కుటుంబానికి పెద్దదిక్కు సుల్తాన
06:33 PM ధర్మపురి అరవింద్ అహంకారాన్ని దించి తీరుతాం..
06:32 PM ఘనంగా ముగిసిన బిరప్ప పండగ ఉత్సవాలు..
06:12 PM మహాంతంలో అభివృద్ధి పనులకై ఎమ్మెల్సీకి వినతి..
06:11 PM హాల్ టికెట్ కోసం విద్యార్థులకు ఇబ్బంది పెట్టొద్దు : డి ఈ ఓ రాజు
06:04 PM నందిగామలో సిసి రోడ్డుకై ఎమ్మెల్యేకు వినతి..
06:03 PM ఆయిల్ ఫామ్ సాగుకు..సిద్ధిపేట జిల్లా లాభదాయకం శ్రేయస్కరం
06:02 PM ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్
06:01 PM ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు బయలు దేరిన ఇందూర్‌ ‌బిజేపి నేతలు
06:00 PM ఎంపీ దర్మపురి ఆరవింద్ పై రాజద్రోహం నమోదు చేయాలి
05:59 PM వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్
05:59 PM తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు ఆర్మూర్ లో....
05:58 PM మే 18న యు.ఎస్ పిసి నిరసన ప్రదర్శనలు విజయవంతం చేద్దాం
05:22 PM కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను తిప్పి కొడుతాం
05:22 PM అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్న అధికారులు
05:20 PM మద్యం సేవించి ఆటోడ్రైవర్ హల్చల్
05:18 PM ఏజెన్సీ ప్రాంత దళితులకు వర్తింపు
05:16 PM ఇంటర్ పరీక్షలో 662 మంది గైర్హాజరు
05:16 PM జాతీయ స్థాయి విజేతలు
05:00 PM ఈ నెల 16న ఉద్యోగ మేళా
04:55 PM మన అలవాట్లు యోగ మయమైతే జీవితం ఆనందమయమే
04:53 PM ప్రభుత్వ సేవలను వినియోగించుకోవలన్న మేయర్
07:58 AM కేటీఆర్ పరువు నష్టం దావాపై ఘాటుగా స్పందించిన బండి సంజయ్
08:28 PM దుకాణ నిర్వాహకురాలిపై దాడి...
07:38 PM జీ రాధ కు ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు...
07:36 PM అశ్వారావుపేటలో విద్యుత్ కార్మిక సంఘం సమావేశం
07:35 PM మెడికో విద్యార్థిని హఠాన్మరణం
07:31 PM ప్రధమ గణితం,చరిత్ర,జీవ శాస్త్రాలు పరీక్షకు 33 మంది గైర్హాజర్
07:28 PM మన ఊరు - మన బడి పనులు ప్రారంభించాలి
07:25 PM స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి: సునీల్ రెడ్డి
06:43 PM సుజాత గౌడ్ కు ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు...
06:40 PM పల్లె ప్రగతికి సిద్దంగా ఉండాలి: ఎం.డి.ఒ విద్యాధరరావు
06:39 PM నిబంధనలకు విరుద్ధంగా వాటర్ ప్లాంట్లు .. ట్రాఫిక్ ఇబ్బందులు
06:37 PM ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
06:34 PM పట్టణ ప్రగతిలో శుద్దిపేటగా మన సిద్దిపేట
06:29 PM ఘనంగా దుర్గమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట
06:21 PM మాతమ్మ ఆలయాన్ని దర్శించుకున్న బీజేపీ నాయకులు
06:13 PM కల్లు షాపులలో రెగ్యులర్ గా తనిఖీలు చేపడతాం
05:56 PM బీడీ పరిశ్రమలో పనిచేసే అన్ని క్యాటగిరి కార్మికులకు వేతనాలు పెంచాలి
05:48 PM చెక్కులందజేత అభినందనీయమే..మిగతా సంక్షేమ పథకాలేవి...?
04:57 PM ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు

Top Stories Now

బ్యాంకు లావాదేవీలపై కేంద్రం కొత్త రూల్..!
నిరుద్యోగులకు శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల
ఎంపీపై సీఎం కేసీఆర్ సోద‌రుడి కుమార్తె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
హైదరాబాద్ లో నోరో వైరస్ కలకలం
బూస్ట‌ర్ డోస్ పై కేంద్రం కీలక ప్రకటన
భార‌త్‌లోకి ప్ర‌వేశించిన క‌రోనా కొత్త వేరియంట్‌
ప్రధానిని చంపుతామంటూ మెయిల్
హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్
ప్రయాణికులకు షాక్..ఆర్టీసీలో మళ్లీ పెరిగిన చార్జీలు..!
స్విస్ ఓపెన్ విజేతగా పీవీ సింధు
ఐపీఎల్ ముందు ధోనీ సంచ‌ల‌న నిర్ణ‌యం
టీచ‌ర్‌ను 101 సార్లు కత్తితో పొడిచిన వ్యక్తి
పల్లె వెలుగు బస్సుల్లో  రౌండప్‌ చార్జీల అమలు
తెలంగాణ‌లో భారీగా పెరిగిన చికెన్ ధ‌ర‌లు
నగరంలో 48గంటల పాటు మద్యం దుకాణాలు బంద్
ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ శుభవార్త
భర్త తల నరికి గుడి వద్ద వేలాడదీసిన భార్య
కందికొండ యాదగిరి ఇక లేరు
ఐదు రాష్ర్టాల ఎన్నికల లైవ్ అప్ డేట్స్..
ఉద్యోగాల భర్తీ పై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.