మామూళ్ల మత్తులో అధికారులు !
లైసెన్స్ షాపులొ దొరకని స్టాకు బెల్టుషాపులో లభ్యం
నవతెలంగాణ గోవిందరావుపేట
మండలంలోని మద్యం వ్యాపారుల బెల్ట్ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. లైసెన్స్ షాపులో దొరకని స్టాకు పుష్కలంగా బెల్టుషాపులు లభిస్తుందంటే బెల్టు దందా ఏ స్థాయిలో కొనసాగుతుందో అర్థం చేసుకోవాలి. అసలు షాపుల కంటే అధికంగా మద్యం విక్రయిస్తున్న బెల్టు షాపులకు వాహనాల ద్వారా స్టాకును పంపిస్తున్నారు అంటే బెల్టు దందా పై ఎందుకంత ఆపేక్ష. ఒక్క మటలో చెప్పాలంటే అధిక లాభాల కోసమే ఈ ప్రయాస నఅని ఆరోపణలు వస్తున్నాయి. అసలు షాపులో అమ్మకం కంటే బెల్టు షాపులకు విక్రయించడం ద్వారా అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. ఎటొచ్చి మద్యం ప్రియుల జేబుకి చిల్లు పడుతుంది. అత్యధికంగా జనాభా హమాలీ కూలి వాళ్లు తాగే మందు అసలు షాపులో దొరకకపోవడంతో వారు బెల్టుషాపులను ఆశ్రయిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా వారు ఎమ్మార్పీ ల కంటే అధిక ధరలు చెల్లిస్తున్నారు. ఈ తతంగమంతా తెలిసినా తెలియనట్లు అధికారులు దీనితో పని లేదన్నట్టు ఊహాలోకాల్లో తేలిపోతూ ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. మండల వ్యాప్తంగా వందల సంఖ్యలో బెల్టుషాపులు నడుస్తున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఎవరైనా బెల్టుషాపుల విషయాన్ని ప్రస్తావిస్తే మీరు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే మేము స్పందిస్తామని చెబుతూ వారి నోరు ముయిస్తున్నారు అని ఆరోపణలు వచ్చాయి. గుడుంబా పై దాడులు నిర్వహించినట్లు బెల్టు షాపులపై ఎందుకు దాడులు నిర్వహించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం కరువైంది. బెల్టు షాపుల విషయంలో అబ్కారి అధికారులు కండ్లుండి చూడలేని దృతరాష్ట్ర పాలన కొనసాగిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
పేరుకే పర్మిట్- అంతా అవుట్ సైడ్
మద్యం షాపులు పేరుకే పర్మిట్ రూమ్ ల పేరుతో సెట్టింగ్ నిర్వహిస్తున్నారు. కానీ మద్యం ప్రియులు 80 శాతం మంది బహిరంగ ప్రదేశాల్లోనే మద్యం సేవిస్తున్నారు. దీనిపై వివరణ అడిగితే పర్మిట్ రూములు పరిశుభ్రంగా ఉండటం లేదని. అందువల్లే బయట సేవించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వారంటున్నారు. పర్మిట్ రూమ్ తీసుకుని మద్యం సేవించే వారికి కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయకపోవడం వల్లే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నట్లు వారు తెలుపుతున్నారు. వీటిని మాత్రం ఏ అధికారి పట్టించుకోడు ఎందుకంటే ప్రతినెలలారావలసిన మామూలు వస్తున్నందున ఎవరు ఏమి చేసుకున్న మనకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారనీ పలువురు ఆరోపిస్తున్నారు.
తినుబండారాల తో అదనపు ఆదాయం.
మద్యంతో అమ్మిన వ్యాపారం లాభాలు సరిపోవు అన్నట్టుగా మద్యం వ్యాపారులు వారి మద్యం షాపుల వద్ద ప్రతి నెలా 30 నుండి 50 వేల లీజు కిరాయి ల పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు. అబ్కారి నిబంధనల ప్రకారం మద్యం షాపుల వద్ద ఎలాంటి తినుబండారాలను విక్రయించవద్దని అధికారులు చెబుతున్నా వాటిని పాటించే వారు లేరు. అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకునే అధికారి లేడు. మటన్ .చికెన్ .కోడిగుడ్డు. రకరకాల ప్రైలు. అధిక ధరలకు విక్రయిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. ధర ఎంత విక్రయిస్తున్న సరుకు ఎలాంటిది నాణ్యమైన కాదా అనే క్వాలిటీని కూడా పరిశీలించే పరిస్థితి లేదు. ఈ ప్రకారంగా కూడా మద్యం సేవించే వారి ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మద్యం క్వాలిటీ పై మద్యం ప్రియుల భిన్నాభిప్రాయాలు.
మద్యం షాపులు విక్రయిస్తున్న మద్యం క్వాలిటీ పై మద్యం ప్రియులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు మద్యం బాగుంది అంటే మరికొందరు మద్యం తాగితే దగ్గు వస్తుందని కండ్లవెంట ఊసులు తోడు తున్నాయని. తెల్లవారి నీరసంగా ఉంటుందని క్వాలిటీ మద్యం కాకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో లైసెన్స్ మద్యం షాపులోనే
కొందరు వ్యక్తులు నైపుణ్యంతో మూతలు తీసివేసి కొంత మద్యాన్ని తొలగించి నకిలీ మద్యాన్ని నింపుతూ పట్టుబడిన సందర్భాలు ఉండడంతో ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి. వారు చేస్తున్న పనికి అప్పటి పోలీసులే ఆశ్చర్యపోయారు. అంతటి నైపుణ్యం కలిగిన వారు ఈ మండలానికి చెందిన వారు కావడం వల్ల అనుమానాలకు తావిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పెండ్లీలు. లక్నవరం పర్యాటక కేంద్రం. పర్యాటకుల తాకిడి వీటిని ఆసరా చేసుకుని బెల్ట్ షాపు వారు కూడా అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2022 04:58PM