నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం. కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్ ఎల్ ఎం, ఎల్ ఎల్ బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ (ఎ పి ఇ, పి సి హెచ్ డ ఐ ఎం బి ఎ) కోర్సులకు చెందిన పీజీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగినట్లు తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారిని ప్రోఫేసర్ డాక్టర్ ఎం. అరుణ తెలిపారు.
సోమవారం ఉదయం జరిగిన మొదటి, ఎనిమిదవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 2,707 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 2443 మంది హాజరు, 264 మంది గైర్హాజరు అయినట్లు ఆమె తెలిపారు. మధ్యాహ్నం జరిగిన ఆరవ, పదవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 127 నమోదు చేసుకోగా 125 మంది హాజరు, 02 గైర్హాజరు అయినట్లు ఆమె తెలిపారు.
ప్రశాంతంగా కొనసాగుతున్న డిగ్రీ వన్ టైం చాన్స్ పరీక్షలు..
తెలంగాణ యూనివర్సిటీలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ కోర్సుకు చెందిన మొదటి, రెండో, మూడవ ఇయర్ వైస్ (వన్ టైం చాన్స్) థియరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగినట్లు తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారిని ఎం. అరుణ తెలిపారు.
ఉదయం జరిగిన మూడో సంవత్సర బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 289 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 254 మంది హాజరు, 35 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సంవత్సర బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 237 నమోదు చేసుకోగా 221 మంది హాజరు, 16 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2022 06:03PM