-సీపీఐ(ఎం),ఎస్ఎఫ్ఐ అధ్వర్యంలో సుందరయ్య వర్థంతి
నవతెలంగాణ-బెజ్జంకి
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలని సీపీఐ(ఎం),ఎస్ఎఫ్ఐ మండల నాయకులకు సీపీఐ(ఎం)మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద సీపీఐ(ఎం),ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి బొమ్మిడి సాయి కృష్ణ, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మంద వంశీకృష్ణ, సీపీఎం నాయకులు బోనగిరి లింగం, బొమ్మిడి నితీష్, రమణ,రాజ్ కుమార్,వినయ్, హరిష్,విద్యార్థులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm