నవతెలంగాణ-భిక్కనూర్
సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నందున ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సబ్ ఇన్స్పెక్టర్ హైమద్ తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుండి 28 వరకు పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 100 మీటర్ల వరకు 144 సెక్షన్ ఉంటుందని చెప్పారు. పరీక్షా కేంద్రాల పరిధిలో గుంపులుగా ఉండవద్దని సూచించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో జిరాక్స్ సెంటర్లు తెరిచినా, పరీక్షా కేంద్రాల వద్ద గుంపులు గా ఉన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm