- రెండవ రోజు 181 గైర్హాజరు
నవతెలంగాణ కంటేశ్వర్
పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. మొత్తం పదవ తరగతి పరీక్షల కోసం నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో రెండవ రోజు మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 153 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా రెండవ రోజు 22394 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 22213 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 181 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలియజేశారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ఇలాంటి జిరాక్స్ షాపులు తెరచి ఉంచకూడదు నిబంధనల మేరకు అన్ని జిరాక్స్ షాప్ బంద్ చేయించారు. పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో 153 సిట్టింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే జిల్లా ఎడ్యుకేషనల్ అధికారి దుర్గాప్రసాద్ 9 పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. జిల్లా లెవెల్ అబ్జర్వర్లు 5 పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ కార్ 46 బృందాలు పరిశీలించినట్లు తెలియజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్కడైతే అవసరమున్నా ఇన్విజిలేటర్లు అందుబాటులో లేని వారిపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 May,2022 06:04PM