నవతెలంగాణ కంటేశ్వర్
వైశాఖమాస హనుమాన్ జయంతి సందర్భంగా బుధవారం నగరంలోని పలు ఆంజనేయ ఆలయాలలో నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్ పూజలు నిర్వహించారు. నగరంలోని ప్రసిద్ధ ప్రాచీన గోల్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గోల్ హనుమాన్ ఛైర్మెన్ నీలగిరి రాజు, ఆలయ కార్యనిర్వహక అధికారి వేణు, డైరెక్టర్లు శివానంద్, కృష్ణ రెడ్డి, భారతి, గ్యానేశ్వర్, పూజారి రాజు జోషి, దయల్, ప్రశాంత్ భక్తులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm