నవతెలంగాణ సూర్యాపేట
స్థానిక సూర్యాపేట జిల్లా బాల భవన్ లో వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేసిన తదనంతరం చిన్నారులు తమ నైపుణ్యాలను మెరుగు పర్చుకునెందుకు వీలుగా ఉందా లేదా లేక ఏవైనా సౌకర్యాల వసతుల కొరత ఉందా అని పర్యవేక్షించడానికి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తమ సిబ్బంది సెక్టరియల్ అధికారులను ఆదేశించగా దేవర శెట్టి జనార్ధన్,నూకల ప్రతాప్ లు గురువారం బాల భవన్ ను పర్యవేక్షించారు. అన్ని విభాగాల వారీగా చిన్నారులు వారి ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. తదనంతరం చిన్నారులను సమాచారం అడిగి అధికారులు తెలుసుకున్నారు. తల్లిదండ్రులతో ముచ్చటించగ వారు సంతృప్తిని వ్యక్తం చేస్తూ బాలలకు బాల్ భవన్ ఏర్పాటు తో క్రమ శిక్షణ, మానవతా విలువలు అవగాహన కల్పించడం, సంస్కృతి సాంప్రదాయాలు కళలు శిక్షణ అందించడం ముఖ్య ఉద్దేశ్యం గా పనిచేస్తున్నదని,తమ పిల్లల అదృష్టం.. బాల్ భవన్ అందుబాటులో ఉండటం అని సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ కు, జిల్లా విద్యాశాఖ అధికారికి కృతజ్ఞతలు తెలిపారు.
తదనంతరం ప్రతి విభాగానికి వెళ్లి చిన్నారులతో మాట్లాడి అభినందించారు అధికారులు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు మాట్లాడుతూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడం విశేషం అని, అన్ని రంగాల్లో చిన్నారులు ఆరితేరాలని అన్నారు. సిబ్బంది గురుంచి మాట్లాడుతూ చిన్నారులకు ఆసక్తికి తగినట్టుగా శిక్షణ ఇవ్వడం , ఎలాంటి ఇబ్బందీ లేకుండా సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ రెడ్డి జాగ్రత్తలు పాటించడం అభినందనీయం అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో దాసరి యల్లయ, ఉమా, సత్యనారాయణ సింగ్, అనిల్, సాయి చరణ్, వీరు నాయుడు, పద్మ, సునీత, పేరెంట్స్ స్టూడెంట్స్ ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 May,2022 05:47PM