నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సి బి సి ఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూ లర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగినట్లు తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారిని ప్రోఫేసర్ డాక్టర్ ఎం. అరుణ తెలియజేశారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 9254 నమోదు చేసుకోగా 8552 మంది హాజరు, 702 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన రెండవ సెమిస్టర్ రెగ్యూలర్, మూడవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 13305 నమోదు చేసుకోగా 12314 మంది హాజరు, 991 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు.
భీంగల్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అడ్వాన్స్ అకౌంటింగ్ సబ్జెక్ట్ లో ఒక విద్యార్థి, కామారెడ్డిలోని ఆర్ కె డ్రిగ్రీ కళాశాలలోని కెమిస్ట్రీ సబ్జెక్ట్ లో ఒక విద్యార్థి మాల్ ప్రాక్టిస్ కు పాల్పడుతూ డిబార్ అయినట్లు అరుణ తెలిపారు.
ప్రశాంతంగా కొనసాగుతున్న ఎం.ఎడ్. పరీక్షలు
తెలంగాణ యూనివర్సిటీలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎడ్. మొదటి సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగినట్లు తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారిని ప్రోఫేసర్ డాక్టర్. అరుణ తెలియజేశారు. ఉదయం జరిగిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 41 నమోదు చేసుకోగా 39 మంది హాజరు, 02 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన మూడవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 32 నమోదు చేసుకోగా, 32 మంది హాజరు, ఎవరూ గైర్హాజరు కాలేదని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jun,2022 08:11PM