-సీఐ లతాకుల రఘుపతి రెడ్డి
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
గ్రామీణ విద్యార్థులు పట్టుదలతో చదివితే మంచి ఫలితాలు వస్తాయని సీఐ రఘుపతి రెడ్డి అన్నారు. 10వ తరగతి లో 10 జీపీఏ సాధించిన దుండ్ర ఛత్రపతి శివాజీ ని ఆయన అభినందించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతు చదువు చెప్పిన గురువులను గౌరవించాలని,ఉపాధ్యాయులు చేసిన బోధనలు మన బంగారు భవిష్యత్ కు పునాదులు అవుతాయన్నారు. లక్ష్యం చేర వరకు విశ్రమించకుండా చదివితే గమ్యం చేరుతామన్నారు. ఉత్తమ ఫలితాలు రావడానికి పేదరికం అడ్డు కాదని ఏవరైన కష్టపడి చదివితే ప్రథమ స్థానంలో నిలుస్తారని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm