నవతెలంగాణ-కంటేశ్వర్
హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఎమ్. మహేందర్ రెడ్డి, ఐ.పి.యస్ వీడియో కాన్ఫెరెన్స్ సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిజిపి పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్ లో నేడు పోలీస్ అమరవీరుల దినోత్సవం -2022 సందర్భంగా వ్యాసరచన పోటీలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎ.ఆర్. హెడ్ క్వార్టర్స్, మహిళా రిజర్వు ఇన్స్ పెక్టర్ ఎల్. స్రవంతి కి రూ॥ 10,000/- క్యాష్ రివార్డు తెలంగాణ రాష్ట్ర డి.జి.పి శ్రీ ఎమ్. మహేందర్ రెడ్డి, ఐ.పి.యస్ ఇవ్వడం జరిగింది. సిబ్బంది అందరూ హెచ్.ఆర్.ఎమ్.ఎస్ తప్పకుండా వాడే విధంగా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. డయల్ 100 ఫిర్యాదుల పట్ల త్వరితగతిన స్పందించాలని అన్నారు. సి.సి.టి.ఎన్.ఎస్ (క్రైమ్ క్రిమినల్ ట్రాకింక్ నెట్వర్కింగ్ సిస్టం) యందు పోలీస్ స్టేషన్ లోని ఎఫ్.ఐ.ఆర్ / కేసుల పరిశోధన వివరాలు ఎప్పటికప్పుడు పొందపర్చాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్ పరిదులలో పెట్రోలింగ్ ముమ్మరం చేయడం, బీట్ల ఏర్పాటు, రాత్రి సమయాలలో వాహనాల తనిఖీ చేసి దొంగ తనాల నివారణకు కృషి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఆటోలలో, జీవులలో సామర్థ్యానికి మించి ప్యాసింజర్లను ఎక్కకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మోటారు వాహనాల యాక్టు ప్రకారంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు మరియు భవిష్యత్తులో తీసుకోవల్సిన చర్యల గురించి క్లుప్తంగా వివరించారు. ఇప్పటివరకు జరిగిన నేరాలలో త్వరితగతిన పరిశోధన పూర్తిచేసి పెండింగ్ నేరాల శాతం తగ్గించాలని సూచించారు. కోర్టులలో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా కృషి చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పెండింగ్ చలానాలు కట్టేవిధంగా చర్యలు తీసుకోవాలి.
గ్రామాలలో పోలీస్ కళాబృందాల ద్వారా అవగాహన సదస్సులను నిర్వహించడం జరిగింది అని తెలిపారు.అలవాటుపడిన నేరస్థులపై పి.డి యాక్టు నమోదు చేయాలన్నారు. మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి మొదలగు చట్టవ్యతిరేక కార్యాకలాపాలపై ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు మరియు లాడ్జీలలో ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేయడం. షీ టీమ్స్ మరింత సమర్ధవంతముగా పనిచేయాలి. పెండింగ్లో ఉన్నఎన్.బి. డబ్ల్యూస్లపై ప్రత్యేకంగా డివిజన్ పరిధిలో టీమ్స్ ఏర్పాటుచేసి త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాట గురించి సూచించారు. నిజామాబాద్లోని పోలీస్ స్టేషన్ల వారిగా పెండింగ్లో ఉన్న కేసులను క్షుణ్ణంగా సమీక్షించి త్వరితగతిన దర్యాప్తు ముగించడానికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి చిన్న నేరాలు జరుగకుండా సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలలో నిఘా వ్యవస్థ పటిష్ట పరచాలన్నారు. 11 వర్టికల్ వ్యవస్థల గురించి క్షుణ్ణంగా చర్చిండం జరిగింది. ఈ సమావేశంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు, ఐ.పి.యస్., డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ వి. అరవింద్ బాబు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఎ.సి.పిలు ఎ.వెంకటేశ్వర్, ఆర్.ప్రభాకర్ రావు, కె.ఎమ్.కిరణ్ కుమార్, నారాయణ, ఎ.ఓ రామారావు, ఆఫీస్ సూపరింటెండెంటులు శంకర్, మక్సూద్ హైమద్, గోవింద్, వర్టికల్ అఫీసర్లు, రేంజ్ ఆఫీస్ మేనేజర్ రాజ ప్రసాద్ రావు, సి.ఐలు, స్పెషల్ బ్రాంచ్ ఎస్.ఐ ఎమ్.డి.ముఖీద్ పాషా, సి.సి.ఆర్.బి ఎస్.ఐ చాందయ్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 28 Nov,2022 06:41PM