నవతెలంగాణ-ధర్మసాగర్
మత్స్య కార్మికులు ఆర్థికంగా ఎదగడం కోసం ప్రభుత్వం వారి ఆర్థిక పరిపుష్టిని పెంపొందించుటకు ఉద్దేశించినదే ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంమని ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రిజర్వాయర్ నందు నాలుగు లక్షల ఉచిత చేప పిల్లలను రిజర్వాయర్ లోనికి విడుదల చేయడం చేశారు. అనంతరం మత్స్య కార్మికులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్సకారుల అభివృద్ధి సంక్షేమమే కోసం ధర్మసాగర్ రిజర్వాయర్లో 4 లక్షల ఉచిత చేప పిల్లలను రిజర్వాయర్ లోకి వదలడం జరిగిందని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాలవారికి దామాషా జనాభా నిష్పత్తి ప్రకారం అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు. అందులో భాగంగా ముదిరాజులకు ఉచిత చేపపిల్లలతో పాటు ఉచిత రొయ్య పిల్లలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్మికులు ప్రమాదవశాత్తు చెరువులో మరణిస్తే 5 లక్షల బీమాసౌకార్యం అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మ కవిత రెడ్డి, జిల్లా కోప్టేట్ సభ్యురాలు లాల్ మొహమ్మద్, జిల్లా మత్స్య శాఖ డైరెక్టర్ పిట్టల సత్యనారాయణ, వైసీపీ బండారు రవీందర్,తాసిల్దార్ మర్కల రజిని, ఎంపీడీవో జోహార్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు సర్పంచి మునిగిల రాజు,సర్పంచులు ఎర్రబెల్లి శరత్, కర్ర సోమిరెడ్డి,ఎంపీటీసీలు బొడ్డు శోభా సోమయ్య, రొండి రాజు యాదవ్, కళ్లెపు రమాదేవి, మాచర్ల సుదర్శన్, బొక్క దయాకర్, కురుసపల్లి బిక్షపతి,ముఖ్య నాయకులు సోంపల్లి కరుణాకర్, రావుల వెంకట్ రెడ్డి, ప్రజాప్రతినిధులు , సంబంధిత శాఖల అధికారులు,మత్స్య సహకార సంఘాల నాయకులు సభ్యులు మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 30 Nov,2022 05:51PM