నవతెలంగాణ-ఏర్గట్ల
కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా బుధవారం మండలంలోని తొర్తి గ్రామంలో గ్రామస్తులతో ఎస్సై రాజు సమావేశం అయ్యారు. అనంతరం ఆయన ప్రజలతో మాట్లాడుతూ... రోడ్డుపైన ఎవరు ధాన్యం ఆరబోయకూడదని, వాహనదారులు రాత్రిళ్ళు ప్రమాదాలకు గురై చనిపోతున్నారని అన్నారు. గ్రామంలో ప్రధాన కూడళ్ళలో సీసీ కెమెరాలను గ్రామస్తులు అమర్చుకోవాలని సూచిస్తూ...వాటి ప్రాధాన్యతను గ్రామస్తులకు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm