- సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ
నవతెలంగాణ-డిచ్ పల్లి
రాష్ట్ర ప్రభుత్వం అనారోగ్యల పాలై సమయానుసరం ఏ మందులు ఎప్పుడూ వేసుకోవలో తెలియక అయోమయంలో ఉండి ఇతర మందులు వాడటం వల్ల తివ్ర అనారోగ్యం పాలౌతున్నరనే సదుద్దేశంతో డయాబెటిక్ కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని విటిని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, ఉప సర్పంచ్లు ఫోరం మండల అధ్యక్షులు రఘునథన్ రాము లు అన్నారు. శనివారం ఇందల్ వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామ పంచాయతీ లో డయాబెటిక్ పేషంట్స్ లకు మందుల కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ లోలం సత్యనారాయణ, ఉప సర్పంచ్ రఘునథన్ రాము, వైద్య సిబ్బంది వెంకట్ రెడ్డి లు మాట్లాడుతూ రోజు ముడు సార్లు వేస్కోనే వివిధ రకాల మందులను ప్రతి నేలకు సరిపడా ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని, డాక్టర్లు సూచించిన విధంగా సమయనుసరం మందులను వాడుకోవాలి వివరించారు. కిట్లో ఉదయం, సాయంత్రం, రాత్రి కి వేసుకోనే మందులు ఉంటాయని ఒక మార్చి పోయిన ఇంట్లో ఎవరైనా ఉంటే వారికి అడిగి తెలుసుకుని మందులను వాడుకోవాలన్నరు. కార్యక్రమంలో ఎంఎన్ఎం దెవిమేరి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 05:58PM