నవతెలంగాణ-కంటేశ్వర్
ఎంపీడీవో కార్యాలయం లోని సామాగ్రిని సంబంధిత అధికారులు జిల్లా యంత్రాంగం తమకు కేటాయించిన జిల్లా పరిషత్ కార్యాలయంలోకి తమ సామాగ్రిని పంపిస్తున్న దృశ్యం నవ తెలంగాణకు చిక్కింది. అలాగే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెల్నెస్ సెంటర్ ను తరలించే సమయంలో వెల్నెస్ సెంటర్ను తరలించవద్దని డిమాండ్ చేయగా తప్పనిసరి పరిస్థితులలో అక్కడి నుండి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నాలుగు ఫ్లోర్ కు తరలించడం జరిగింది. నిజామాబాద్ ఎంఈఓ కార్యాలయంలో నగరంలోని శంకర్ భవన్ లో గల ఓ గదిలో కేటాయించగా అక్కడికి ఎంఈఓ కార్యాలయంలో ఉన్న సామాగ్రిని అక్కడికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm