నవతెలంగాణ-భిక్కనూర్
ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేశం తెలిపారు. శనివారం మండలంలోని జంగంపల్లి, భిక్కనూర్, బస్వాపూర్ లో కళా ప్రదర్శన ద్వారా ఆర్టీసీ పథకాలను వివరించడం జరిగిందని ఆయన తెలిపారు. గత 90 సంవత్సరాలుగా ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని, కళాకారులు పాటల రూపంలో ప్రదర్శన రూపంలో పరకాలను వివరించారు. ఆర్టీసీ ద్వారా రాయితీ పథకాలతో పాటు కార్గో సేవలను ప్రజలకు అందించడం జరుగుతుందని కళాబృందం వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm