- వ్యవసాయ శాఖ అధికారి ప్రవీన్
నవతెలంగాణ-డిచ్ పల్లి
ఆయిల్ ఫాం సాగు కు రైతులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఈ పంట సాగుపై సబ్సిడీ అందజేస్తుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రవీణ్ అన్నారు. సోమవారం ఇందల్ వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ నరేష్ అధ్యక్షతన ఆయిల్ పాం సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ఎకరానికి 50 మొక్కలు పెట్టాలని ఒక్కో ముక్క ఫుల్ కాస్ట్ 193/-అయితే రాయితీ పోను రైతు ఒక మొక్కకి 20 రూపాయలు కట్టాలని అలా ఒక ఎకరానికి మొత్తం వెయ్యి రూపాయల డీడీతీసి సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారికి ఇవ్వవలేనని, డ్రిప్ కి ఎస్సీ ఎస్టీలకు నూరు శాతం రాయితీ, బీసీ ఓసీ లకి 90% రాయితీ అందరూ రైతులు కూడా జీఎస్టీ మాత్రం కట్టుకోవాలని తెలిపారు.
ఆయిల్ ఫాం పంట సాగు వివరాలు, వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఆయిల్ ఫాం పంట వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చని, రైతులకు అధిక లాభాలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతులందరూ ఆయిల్ ఫాం పంటపై మక్కువ చుపి డీడీలు తీసి మాకు ఇవ్వాలని కోరారు. కార్యక్రమం లో ఎంపిడిఓ రాజ్ కాంత్ రావు, వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు ప్రకాష్ గౌడ్, శ్రీహరి, సతీష్ ఎంపీటీసీ బాపురావు, రైతులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Dec,2022 07:29PM