నవతెలంగాణ-డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ నోముల విజయ లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఆయిల్ ఫాం సాగుపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సహాయ వ్యవసాయ సంచాలకులు పిండి ప్రదీప్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ ఒక ఎకరానికి 50 మొక్కలు పెట్టాలని ఒక్కో మొక్క విలువ 193 అయితే రాయితీ పోను రైతు ఒక మొక్కకి 20 రూపాయలు మాత్రమే చెల్లించాలని, అలా ఒక ఎకరానికి మొత్తం వెయ్యి రూపాయల డీడీతీసి సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారికి ఇవ్వలని, డ్రిప్ కి ఎస్సీ ఎస్టీలకు నూరు శాతం రాయితీ, బీసీ ఓసీ లకి 90% రాయితీ ఉంటుందని వివరించారు.
అందరూ రైతులు కూడా జీఎస్టీ మాత్రం కట్టుకోవాలని తెలుపడం జరిగినది అదేవిధంగా ఆయిల్ పాము పంట సాగు వివరాలు మరియు వాటి ప్రాముఖ్యతను తెలుపడం జరిగినది. ఆయిల్ ఫాం పంట వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చని, రైతులకు అధిక లాభాలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతులందరూ ఆయిల్ ఫాం పంటపై మక్కువ చూపి డీడీలు తీసి అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమం వైస్ ఎంపిపి బుసని అంజయ్య లో ఏఈఓలు శ్రీహరి, ప్రకాష్ గౌడ్, సతీష్ ఎంపిఓ రాజ్ కాంత్ రావు,ఉప సర్పంచ్ దర్పల్లి బాబు శరత్ రైతులు పాల్గొన్నారు.
అందరూ రైతులు కూడా జీఎస్టీ మాత్రం కట్టుకోవాలని తెలుపడం జరిగినది అదేవిధంగా ఆయిల్ పాము పంట సాగు వివరాలు మరియు వాటి ప్రాముఖ్యతను తెలుపడం జరిగినది. ఆయిల్ ఫాం పంట వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చని, రైతులకు అధిక లాభాలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతులందరూ ఆయిల్ ఫాం పంటపై మక్కువ చూపి డీడీలు తీసి అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమం వైస్ ఎంపిపి బుసని అంజయ్య లో ఏఈఓలు శ్రీహరి, ప్రకాష్ గౌడ్, సతీష్ ఎంపిఓ రాజ్ కాంత్ రావు,ఉప సర్పంచ్ దర్పల్లి బాబు శరత్ రైతులు పాల్గొన్నారు.