- వనదేవతలకు ప్రత్యేక మొక్కులు
నవతెలంగాణ- తాడ్వాయి
మేడారంలో సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు గురువారం భక్తులు ప్రత్యేక మొక్కులు చెల్లించారు. జంపన్న వాగు వద్ద పుణ్య స్థానాల ఆచరించి, కళ్యాణ కట్ట వద్ద తలనీనాలు సమర్పించి, గద్దెల వద్దకు చేరుకుని వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే సారే సమర్పించి ప్రత్యేక మొక్కలు చెల్లించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో భారీగా తరలివచ్చారు. వీరికి ఎండోమెంట్ ఈవో రాజేంద్రం ఆధ్వర్యంలో ఎండోమెంట్ అధికారులు, పూజార్ల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు సకల సౌకర్యాలు కల్పించారు. వనదేవతలను దర్శించుకున్న అనంతరం బయట చెట్ల కింద విడిది చేసి సహపంక్తి భోజనాలు ఆరగించారు. అనంతరం ఎవరి ఊర్లకు వారు తిరుగు ప్రయాణం చేశారు. పూజారులు కొక్కర కృష్ణయ్య, సిద్ధబోయిన రమేష్, మునీందర్, లక్ష్మణరావు, అరుణ్, కాక సారయ్య, కాక కిరణ్, ఎండోమెంట్ అధికారులు క్రాంతి, రాజేశ్వర్, రమాదేవి, జగదీశ్వర్, బాలకృష్ణ మధు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Jan,2023 06:58PM