నవతెలంగాణ-భిక్కనూర్
భిక్నూర్ పట్టణంలోని చైతన్య విద్యానికేతన్ పాఠశాలలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రేణు కుమార్ పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా చిన్నారుల వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అశోక్ యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.