నవతెలంగాణ-భిక్కనూర్
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఉన్న బ్రిలియంట్ గ్రామర్ పాఠశాలలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నాగేశ్వర్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో చిన్నారుల వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm