నవతెంగాణ- సిరిసిల్ల
సాహితీ బృందావన విహార జాతీయ వేదిక హైదరాబాద్ రి. నం.1255/2021 సంస్థ అందించే క్రీ. శే. శ్రీ రావుల వెంకట నరసయ్య పంతులు స్మారక పురస్కారం 2022 సంవత్సరానికి గాను సాహిత్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ గౌరవ సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ వివిధ సమకాలీన అంశాలపై రచించిన చైతన్య స్ఫూర్తి -చిటికెన వ్యాసాలు సంపుటిని కమిటీ ఎంపిక చేసింది.
ఇట్టి పురస్కారాన్ని త్వరలో సంస్థ హైదరాబాద్ లో జరుపబోయే కార్యక్రమంలో -డా. చిటికెన కిరణ్ కుమార్ కి ప్రముఖుల చేతుల మీదుగా అందజేయనున్నారని ప్రముఖ కవయిత్రి, సంఘ సేవకురాలు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు నెల్లుట్ల సునీత, సంస్థ గౌరవ సలహాదారులు, మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి పసునూరి సాయి తరుణ్, కోశాధికారి -డా. శ్రీజ లు ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా చిటికెనకు మానేరు రచయితల సంఘం, సిరిసిల్ల జిల్లా రచయితలు జూకంటి జగన్నాథం, ఎలగొండ రవి, డా.వాసరవేణి పరుశురాములు, దేవానందం అశోక్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jan,2023 02:45PM