- సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ-కంటేశ్వర్
రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సిడిపిఓ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి స్వర్ణ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్వాడి ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరంతా మహిళలు బడుగు, బలహీనవర్గాలకు చెందినవారే ఎక్కువమంది ఉన్నారు.
గత 40 సం॥లకు పైగా ఐసిడిఎస్ లో పని చేస్తూ పేద ప్రజలకు సేవలందిస్తున్నారు. అయినా వీరికి కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలేవీ ప్రభుత్వం నేటికీ కల్పించలేదు. దీనివల్ల అంగన్వాడీ ఉద్యోగులు చాలా నష్టపోతున్నారు. మన పక్కనే ఉన్న తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అంగన్వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పండగ బోనస్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. మన రాష్ట్రంలో గారే అంగన్వాడి వర్కర్ పేరును టీచర్స్ గా మార్చారు.
కానీ టీచర్లతో సమానంగా వేతనాలు, ఇతర సౌకర్యాలు మాత్రం ప్రభుత్వం ఇవ్వడం లేదు. టీచర్లతో సమానంగా వేతనం సమావేశంలో ముఖ్యమంత్రిగారు ఇచ్చిన హామీలు అమలు తదితర సౌకర్యాలు కల్పించాలని, ప్రగతి భవన్ చేయాలని అంగన్వాడీ ఉద్యోగులు కోరుతున్నారు.రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ. 5 లక్షలు, హెల్పర్లకు రూ.3 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని అనేక సం॥రాల నుండి అంగన్వాడీ ఉద్యోగులు రాష్ట్రంలో అడుగుతున్నారు. 2022 మే నెలకు అంగన్వాడీ ఉద్యోగులు 1972 గ్రాట్యుటీ చట్టం వర్తింపజేయాలని సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అయినా తెలంగాణ ప్రభుత్వం వీటిని అమలు చేయడం లేదు. దీనివల్ల వయస్సు పైబడ్డ వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
2017 నుండి టిఎడిఎలు, ఇంక్రిమెంట్, ఇన్ఛార్జ్ అలవెన్సులు ప్రభుత్వం చెల్లించడం లేదు. 2018లో కేంద్రం పెంచిన వేతనం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెల్లించడం లేదు. కేంద్రం పెట్టిన పోషన్ ట్రాక్టర్ యాప్ ఉంది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్ఐఎస్ యాప్ను పెట్టడం వల్ల అంగన్వాడీ ఉద్యోగులకు పని భారం పెరగడంతో పాటు అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయి. వీటితో పాటు ఇంకా అనేక సమస్యలతో అంగన్వాడీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. అంగన్వాడీ ఉద్యోగుల పలు డిమాండ్స్ను పరిశీలించి, పరిష్కారం చేయాలని లేని యేడల 2023 మార్చి 1,2,3 తేదీలలో 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామని తెలియజేస్తున్నాము అని తెలియజేశారు.4 లేబర్ కోడ్స్న రద్దు చేయాలి. ఐసిడిఎస్కు బడ్జెట్ పెంచాలి. ఐసిడిఎస్కు నష్టం కల్గించే నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని రద్దు చేయాలి.
సుప్రీంకోర్టు తీర్సు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలి. వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలి. 3. టీచర్లతో సమానంగా అంగన్ వాడీ ఉద్యోగులకు వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలి. 2018 అక్టోబర్ లో కేంద్రం పెంచిన వేతనం అంగన్వాడీ టీచర్లకు రూ. 1,500/-లు, హెల్పర్లకు రూ.750/-లు, మినీ వర్కర్లకు రూ.1.250/-లు రాష్ట్ర ప్రభుత్వం ఎరియర్స్ తో సహా చెల్లించాలి.2017 నుండి ఎ, డి బకాయిలు మొత్తం చెల్లించాలి. దీనికి సరిపడా బడ్జెట్ను వెంటనే రిలీజ్ చేయాలి. 3 సం॥రాల రేషన్ షాపు ట్రాన్స్పోర్ట్ చార్జీలను వెంటనే చెల్లించాలి.
పిఆర్సి ఎరియర్స్ 2021 జూలై, అక్టోబర్, నవంబర్ మూడు నెలలవి వెంటనే చెల్లించాలి. ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఈ సమస్య పరిష్కార కోసం తక్షణమే చర్యలు చేపట్టాలి. మదర్స్ కమిటీలకు చైర్మెన్ గా తల్లులను మత్రమే నియమించాలి. గ్రామ సర్పంచులను చైర్మన్ గా నియమాకం చేసే పద్ధతిని వెంటనే ఉపసంహరించుకోవాలి.ఆరోగ్య లక్ష్మి మెనూ ఛార్జీలు పిల్లలకు రూ.1.15 పై॥ల నుండి రూ. 5/-లకు, గర్భిణీ/బాలింతలకు రూ.240 పై॥ల నుండి రూ.10/-లకు పెంచాలి. డబుల్ సిలిండర్ అన్ని కేంద్రాలకు ఇవ్వాలి. ఎలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీ సెంటర్లంటినీ మెయిన్ సెంటర్లుగా గుర్తించాలి. 12. అంగన్వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి.
వేతనంతో కూడిన మెడికల్ సెలవులు అమలు చేయాలి. 13.2017 నుండి ఇంక్రిమెంట్, ఇన్ ఛార్జ్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలి. ఎన్హెచ్ఐఎస్ యాప్ను పూర్తిగా రద్దు చేయాలి. కేవలం పోషన్ ట్రాకర్ మాత్రమే కొనసాగించాలి. అన్లైన్ పని చేయడానికి వీలుగా ఐప్యాడ్ అంగన్వాడీలకు ఇవ్వాలి.అంగన్వాడీ ఉద్యోగులకు మట్టి ఖర్చులు రూ.50 వేలు చెల్లించాలి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాలకు (ఈవెంట్స్) ఇచ్చే డబ్బులు రూ.250/-ల నుండి
2,000/-లకు పెంచాలి. 17. రేషన్ బియ్యాన్ని శుభ్రపరిచిన వెహికల్ ద్వారానే సప్లై చేయాలి.
ఎండకాలంలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలి. 19. జివో. నెం 14, 19, 8 లను వేంటనే సవరించాలి. అంగన్వాడీ ఉద్యోగులకు ఆసరా, కళ్యాణలక్ష్మి, తదితర ప్రభుత్వ సంక్షేమ పధాకలు అమలు చేయాలి. అన్నారు ఈ సమస్యలను పరిష్కారం చేయకుంటే మార్చ్ ఒకటి రెండు మూడు తేదీలలో సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్వప్న, వాణి, రాజ సులోచన, సునీత, సందీప, జరిన, సూర్య కళ,శివ రాజవ్వ, జ్యోతి, సుమలత, గిరిజ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jan,2023 03:41PM