- ఐఎఫ్టియూ జిల్లా ప్రధాన కార్యదర్శిఎం.సుధాకర్
నవతెలంగాణ-డిచ్ పల్లి
కేజీబీవీ నాన్ టీచింగ్ & వర్కర్స్ కు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని, కనీస వేతనాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ & వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియూ) ఆధ్వర్యంలో ఈనెల 30న జరిగే చలో ఎస్.పి.డి కార్యాలయం పిలుపును జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ అన్నారు. శుక్రవారం కేజీబీవీ డిచ్ పల్లిలో పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఐఎఫ్టియూ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూకేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ & వర్కర్స్ కు ఇప్పటికీ కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు.
వీరికి పీఎఫ్, ఈఎస్ఐ లాంటి ఆరోగ్య, ఉద్యోగ భద్రత పథకాలు అమలు కావడం లేదన్నారు. గత 16 సంవత్సరాలుగా తీవ్ర పనిభారంతో విధులు నిర్వహిస్తూ అనారోగ్యాలకు గురయ్యారన్నారు. వీరికి ప్రభుత్వం నుండి ఎలాంటి మెడికల్ ఇన్సూరెన్స్, ఆరోగ్య భద్రత లేదన్నారు. కనీస వేతనాలు అమలు కాకపోవడంతో శ్రమదోపిడికి గురవుతున్నారన్నారు. కాంటాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.60 కూడా వీరికి అమలు కావడం లేదన్నారు.
పని భారం పెరిగినా ఖాళీలు భర్తీ చేయడం లేదన్నారు. కేజీబీవీల్లో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ ఇవ్వడం లేదన్నారు. కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. తక్షణమే జీవో నెంబర్ 60 ని అమలు చేయాలన్నారు. కేజీబీవీ లో పనిచేసిన సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగాల్లో సర్వీస్ వెయిటేజీ ఇవ్వాలన్నారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. కాలేజీలుగా అప్ గ్రేడ్ అయిన కేజీబీవీల్లో కుక్, స్వీపర్, అటెండర్, స్కావేంజర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. కంప్యూటర్, ఒకేషనల్ ట్రైనర్లకు ఫుల్ టైం వేతనాలు ఇవ్వాలన్నారు. ఏ.ఎన్.ఎంల నైట్ డ్యూటీలను 03 రోజుల నుండి ఒక రోజుకు తగ్గించాలన్నారు.
అకౌంటెంట్లకు బదిలీలు చేపట్టాలన్నారు.
పదవీ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ చెల్లించాలన్నారు. చనిపోయిన వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనలో భాగంగా ఈనెల 30న హైదరాబాదులోని స్టేట్ ప్రాజెక్టు ఆఫీసర్ (ఎస్పీడీ) కార్యాలయం ముందు యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మురళి, కేజీబీవీ సిబ్బంది సుజాత, పద్మ, భాగ్య, శ్రీకన్య, చంద్రకళ, జమున, గీత, మంజుల తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jan,2023 04:58PM