- నిజామాబాద్ పట్టణంలో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభోత్సవం
- కళాభారతి భూమి పూజ
- బిఆర్ఎస్ నాయకులు అందరు పెద్ద ఎత్తున తరలి రావాలి
- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి శనివారం నాడు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ నిజామాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి నిజామాబాద్ కలెక్టరేట్ చేరుకుంటారని, భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ లో రైతులతో జరుగు ముఖాముఖి భేటీలో పాల్గొంటారన్నారు.
అనంతరం కంటేశ్వర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ ను ప్రారంభిస్తారని,రూ.50 కోట్ల అంచనా వ్యయంతో పాత కలెక్టరేట్ వద్ద నూతనంగా చేపట్టనున్న కళాభారతి ఆడిటోరియం నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతారని అన్నారు. ఆ తర్వాత అక్కడే భారత రాష్ట్ర సమితి నాయకులను కెటిఆర్ కలుస్తారని వెల్లడించారు. జిల్లా నలుమూలల నుండి బీఆర్ఎస్ నాయకులు అందరు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ తరలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 27 Jan,2023 06:30PM