నవతెలంగాణ - అశ్వారావుపేట
నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో అంగన్వాడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం ప్రాంగణంలో అంగన్వాడీలు శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడి జిల్లా కార్యదర్శి పద్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరంతా మహిళలు బడుగు, బలహీనవర్గాలకు చెందినవారే ఎక్కువమంది ఉన్నారు. గత 40 సం॥లకు పైగా ఐసిడిఎస్ లోప ని చేస్తూ పేద ప్రజలకు సేవలందిస్తున్నారు. అయినా వీరికి కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలేవీ ప్రభుత్వం నేటికీ కల్పించలేదు. దీనివల్ల అంగన్వాడీ ఉద్యోగులు చాలా నష్టపోతున్నారు. మన పక్కనే ఉన్న తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అంగన్వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ కేరళ తదితర రాష్ట్రాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పండగ బోనస్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు అంగన్వాడీ ఉద్యోగులకు కల్పించడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి రే అంగన్వాడీ వర్కర్ పేరును టీచర్స్ గా మార్చారు. కానీ టీచర్ల తో సమానంగా వేతనాలు, ఇతర సౌకర్యాలు మాత్రం ప్రభుత్వం ఇవ్వడం లేదు. టీచర్ల తో సమానంగా వేతనం తదితర సౌకర్యాలు కల్పించాలని, ప్రగతి భవన్: సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని అంగన్వాడీ ఉద్యోగులు కోరుతున్నారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ.5 లక్షలు, హెల్పర్లుకు రూ.3 లక్షలు ఇవ్వాలని, వేతనం లో సగం పెన్షన్ ఇవ్వాలని అనేక సంవత్సరాలు నుండి అంగన్వాడీ ఉద్యోగులు రాష్ట్రంలో అడుగుతున్నారు. 2022 మే నెలకు అంగన్వాడీ ఉద్యోగుల 1972 గ్రాట్యుటీ చట్టం వర్తింపజేయాలని సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అయినా తెలంగాణ ప్రభుత్వం వీటిని అమలు చేయడం లేదు. దీనివల్ల వయస్సు పైబడ్డ వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 2017 నుండి టి ఏ డి ఎ లు, ఇంక్రిమెంట్, ఇన్చార్జి అలవెన్సులు ప్రభుత్వం చెల్లించడం లేదు. 2018లో కేంద్రం. పెంచిన వేతనం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెల్లించడం లేదు, కేంద్రం పెట్టిన పోషన్ ట్రాకర్ యాప్ ఉంది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ హే చ్ టి ఎస్ యాప్ తో అంగన్వాడీ ఉద్యోగులకు పని భారం పెరగడంతో పాటు అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయి. వీటితో పాటు ఇంకా అనేక సమస్యలతో అంగన్వాడీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రింది డిమాండ్స్ ను పరిశీలించి, పరిష్కారం చేయాలని లేని ఎడల 2023 మార్చి 1,2,3 తేదీలలో 3 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేస్తామని తెలియజేస్తున్నారు.
డిమాండ్ లు
1) లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచాలి ఐసిడి ఎస్ కు నష్టం కలిగించే నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని రద్దు చేయాలి
2) సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలి. వేతనం లో సగం పెన్షన్ నిర్ణయించాలి
3.) టీచర్ల తో సమానంగా అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలి.
4.) 2018 అక్టోబర్లో కేంద్రం పెంచిన వేతనం అంగన్వాడీ టీచర్లకు రూ.1,500/-లు, హెల్పర్లకు రూ.750/-లు, మినీ వర్కర్లకు రూ.1,250/-లు రాష్ట్ర ప్రభుత్వం ఎరియర్స్ తో సహా చెల్లించాలి.
5) 2017 నుండి టి.ఎ, డి.ఎ బకాయిలు మొత్తం చెల్లించాలి. దీనికి సరిపడా బడ్జెట్ ను వెంటనే రిలీజ్ చేయాలి.
6.). 3 సంవత్సరాల రేషన్ షాపు ట్రాన్స్పోర్ట్ చార్జీలను వెంటనే చెల్లించాలి.
7)పీఆర్సి ఎరియర్స్ 2021 జూలై, అక్టోబర్, నవంబర్ మూడు నెలల వి వెంటనే చెల్లించాలి.
8.) ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఈ సమస్య పరిష్కార కోసం తక్షణమే చర్యలు చేపట్టాలి.
9) మదర్స్ కమిటీలకు చైర్మన్గా తల్లులను మత్రమే నియమించాలి. గ్రామ సర్పంచుల ను చైర్మెన్ గా నియామకం చేసే పద్ధతిని వేంటనే ఉపసంహరించు కోవాలి.
10). ఆరోగ్య లక్ష్మి మెనూ ఛార్జీలు పిల్లలకు రూ.1.15 పైసల నుండి రూ.5 లకు, గర్భిణీ/బాలింతలకు రూ.2.40 పైసల నుండి రూ.10 లకు పెంచాలి. డబుల్ సిలిండర్ అన్ని కేంద్రాలకు ఇవ్వాలి.
11)ఎలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీ సెంటర్లు అన్నిటినీ మెయిన్ సెంటర్లు గా గుర్తించాలి.
12). అంగన్వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. వేతనంతో కూడిన మెడికల్ సెలవులు అమలు చేయాలి.
13). 2017 నుండి ఇంక్రిమెంట్, ఇన్ఛార్జ్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలి.
14)ఎన్హెచ్ఎస్ యాప్ ను పూర్తిగా రద్దు చేయాలి. కేవలం పోషన్ ట్రాకర్ మాత్రమే కొనసాగించాలి. అన్లైన్
పని చేయడానికి వీలుగా ఐప్యాడ్ అంగన్వాడీలకు ఇవ్వాలి.
15.)అంగన్వాడీ ఉద్యోగులకు మట్టి ఖర్చులు రూ.50 వేలు చెల్లించాలి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి.
16)అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాలకు (ఈవెంట్స్) ఇచ్చే డబ్బులు రూ. 250/-ల నుండి
2,000/- లకు పెంచాలి.
17)రేషన్ బియ్యాన్ని శుభ్రపరిచిన వెహికల్ ద్వారానే సప్లై చేయాలి.
18) ఎండకాలంలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలి.
19) జివో. నెం 14, 19, 8 లను వేంటనే సవరించాలి.
20. అంగన్వాడీ ఉద్యోగులకు ఆసరా, కళ్యాణ లక్ష్మి, తదితర ప్రభుత్వ సంక్షేమ పధకలు అమలు చేయాలి.
ఈ కార్యక్రమంలో కృష్ణవేణి కర్నాటి రాధా కనక మహాలక్ష్మి ప్రభావతి వెంకటరమణ సరోజిని శాంత కుమారి తాటి లక్ష్మి శ్యామల లావణ్య తదితర అంగన్వాడి సెంటర్ల టీచర్స్ పాల్గొన్నారు