నవతెలంగాణ - అశ్వారావుపేట
కుష్టు వ్యాధి పై ప్రతి ఒక్కరి కి అవగాహన కల్పించాలని గుమ్మడవల్లి ప్రాధమిక ఆసుపత్రి వైద్యాధికారి మధుళిక తన సిబ్బందికి తెలిపారు.ఈ వ్యాధి పై మంగళవారం ఏర్పాటు చేసిన ఆశా డే సందర్భంగా వివరించారు.
అనంతరం వారిచే ప్రతిజ్ఞ చేయించారు.
నా కుటుంబములో లేదా నా పొరుగు వారిలో లేదా ఈ సమాజంలో ఎవరికైనా చర్మంపై స్పర్శ కోల్పోయిన మచ్చలు ఉండి వాటిని తాకినప్పుడు, లేదా దానిమీద నొప్పి కలిగించి నప్పుడు స్పర్శ తెలియకపోతే వారిని సమీప ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ను సంప్రదించి వ్యాధి నిర్దారణ చేసుకోని తగిన చికిత్స తీసుకోమని సలహా ఇస్తాను. కుష్ఠువ్యాధి గ్రస్తులను మరియు కుష్ఠు వ్యాధి కారణంగా అంగవైకల్యం ఏర్పడిన వారిపట్ల శ్రద్ద వహిస్తాను, వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి చికిత్స తీసుకొనేలా నేను భాధ్యత వహిస్తాను.
కుష్ఠు వ్యాధి గ్రస్తులను నా స్వంత కుటుంబ సభ్యులుగా భావించి ఎటువంటి వివక్షత చూపకుండా ప్రేమతో వారి ఆత్మ గౌరవాన్ని పరిరక్షించేలా పాటుపడుతాను. కుష్ఠువ్యాధి ఒక బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి అని , ఎండీటీ చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధి పూర్తిగా తగ్గిపోతుందని, సత్వర చికిత్స ద్వారా కుష్టువ్యాధి మూలంగా వచ్చే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చనే సందేశాన్ని సమాజంలో వ్యాప్తి చేస్తాను.
మహాత్మా గాంధీ కలలు కన్న విధంగా సమీప భవిష్యత్తులో కుష్టువ్యాధి రహిత భారతదేశ నిర్మాణములో అందరితో కలిసి కృషి చేస్తానని, మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో హెచ్.వి దుర్గమ్మ,సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 31 Jan,2023 08:04PM