నవతెలంగాణ శంకరపట్నం
గత కొన్ని రోజులుగా కాళ్ల నొప్పులు భరించలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం సాయంత్రం మండలం పరిధిలోని ఆముదాలపల్లి గ్రామంలో విషాద ఛాయలు చోటుచేసుకున్నాయి, ఈ సందర్భంగా కేశవపట్నం ఎస్సై దేశ్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఆముదాల పల్లి గ్రామానికి చెందిన మార్క తిరుపతి (58) కొన్ని సంవత్సరాలుగా కాళ్ళు నొప్పితో బాధపడుతూ దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య మార్క భాగ్యలక్ష్మి,ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm