నవతెలంగాణ-శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని కేశవపట్నం రాజీవ్ రాహాదారి పై మొలంగూర్ గ్రామానికి చెందిన పెంట సాంబయ్య, శుక్రవారం తమ పనుల నిమిత్తం కేశవపట్నం వస్తుండగా ఆల్ప్రెడ్ నోబెల్ స్కూల్ వద్ద గుర్తుతెలియని వాహనం స్కూటీ ఢీకొట్టగా ఆర్.ఎం.పి సాంబయ్య కి తీవ్ర గాయాలై ఎడమ సైడ్ పక్క టెముకలు మరియు ఎడమ సైడ్ భుజం విరిగి రోడ్డుమీద అపస్మారక స్థితిలో పడి ఉండగా అటుగా వెళుతున్న స్థానికులు చూసి 108 ఫోన్ చేయడంతో 108 సిబ్బంది ఈఎంటి సతీష్ రెడ్డి, పైలెట్ ఎండి ఖలీల్ సంఘటన స్థలానికి చేరుకొని హుటా హుటిన క్షతగాత్రున్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm