- రీజినల్ కో - ఆర్డినేటర్ సంపత్ కుమార్
నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ నగర శివారులో నాగరంలోగల గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో పొరుగు సేవల పద్దతిన తాత్కాలిక కేర్ టేకర్ పోస్టుకు దరఖాస్తులను ఈ నెల 10 వరకు చేసుకోవాలని ఆ సంస్థ ప్రాంతీయ సమన్వయకర్త టి.సంపత్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. ఆసక్తిగల వారు సంబంధిత కళాశాలలో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. విద్యార్హతల ప్రకారం పూర్తి మెరిట్ ఆధారంగా జిల్లా అదనపు కలెక్టర్ ఆమోదంతో ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm