- రెడ్డి సాంబశివ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలో ప్రభుత్వ భూములో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బిరెడ్డి సాంబశివ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం మండల కేంద్రంలో గుడిసవాసులకు పట్టాలు ఇవ్వాలని సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ నుండి భారీ ర్యాలీతొ డప్పు చప్పుల్లతో స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి బిరెడ్డి సాంబశివ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ధర్నాలకు పిలుపు మీద జరిగింది.
భాగంగా 109 సర్వేనెంబర్ పసర గ్రామ శివారులో గల ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలి అని అదేవిధంగా పేదలు వేసుకున్న గుడిసె వాసులకు కనీస అవసరాలు అయినా కూడు, గూడు, గుడ్డ, వైద్యం, విద్య అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. తక్షణమే పెదలేసిన గుడిసెలకు పట్టాలు కల్పించాలని ఐదు లక్షలతో పక్క ఇండ్లు నిర్మించాలని ఈ అంశాలపై నేటి నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఆకుపత్రాలు కల్పించాలని ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో పేదలని వ్యవసాయ కూలీలను కూడగట్టి ఐక్యం చేసి ఈ ప్రభుత్వాన్ని గద్ద దించే విధంగా దశల వారి పోరాటాలను ఉదృతం చేస్తామని ఆయన ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా తుమ్మల వెంకట రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు తీగల ఆగి రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పొదిళ్ల చిట్టిబాబు ప్రజా సంఘాల నాయకులు అంబాల పోషాలు కడారి నాగరాజు గుండు రామస్వామి జటబైన రమేష్ పల్లపు రాజు కందుల రాజేశ్వరి సరిత సువర్ణ సకినాల రాజేశ్వరి పాయం శారద అంబల మురళి అరుణ రాంబాబు వెయ్యి మంది పేదలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Feb,2023 08:22PM