నవతెలంగాణ - కోహెడ
మండలంలోని నాగసముద్రాల గ్రామ మత్స్య సహకార సంఘం నూతన అధ్యక్షుడిగా అప్పిస చిరంజీవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో డైరెక్టర్లుగా గెలిచిన వారితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా మౌటం వెంకటయ్య, ప్రధాన కార్యదర్శిగా అప్పీస సంపత్, కార్యదర్శిగా బైరి సాయిలు, కోశాధికారిగా రాజమల్లయ్యలను ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికైన కార్యవర్గాన్ని కుల సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఎన్నికల పర్యవేక్షకుడి గా పి.సతీష్ రెడ్డి వ్యవహరించారు. అధ్యక్షుడు చిరంజీవి మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm