నవతెలంగాణ - రామారెడ్డి
మండలంలోని ఇస్సన్నపల్లి (రామారెడ్డి) లో వెలిసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి సింధూర పూజలు నిర్వహించారు. మూలబావి నుండి నీరు తెచ్చి, ఆలయాన్ని శుభ్రపరిచి, భక్తుల ఓం భైరవ నామస్మరణతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేసింది. ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు అయ్యారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మాలతి సంతోష్ గుప్తా, ఈవో ప్రభు, ఆలయ పూజారులు శ్రీనివాస్ శర్మ, మనీష్ శర్మ, సిబ్బంది సురేందర్, నాగరాజు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm