- ప్రతి ఇంటికీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకెళ్దాం
- మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి
నవతెలంగాణ-డిచ్ పల్లి
హాథ్ సే హాద్ జోడో యాత్రను మంగళవారం ఇందల్ వాయి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ నిజామాబాద్ రూరల్ నీయోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ డాక్టర్ భూపతి రెడ్డి జేండ ఆవిష్కరించి ప్రారంభించారు. ఆర్టిసి బస్టాండ్ నుండి తిర్మన్ పల్లి గ్రామం వారకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ నిజామాబాద్ రూరల్ నీయోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం (6న) మేడారం లో జోడో యాత్రలు ప్రారంభించారని వివరించారు.
రెండు నెలల పాటు ఈ పాదయాత్రలు కొనసాగుతున్నా యన్నారు. నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఐకమత్యంగా కలిసి మెలిసి జోడో యాత్రలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ జోడో యాత్రల్లో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యం చేస్తున్నారని తెలిపారు.
వైఎస్సార్ హయాంలోనే అభివృద్ధి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే కన్పిస్తుందని డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. వైస్సార్ హయాంలో జిల్లాలో మెడికల్ కాలేజ్, యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆయన విమర్శించారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తే జిల్లా సస్యశ్యామలంగా మారేదన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరిట సీఎం కేసీఆర్ ప్రభుత్వం కమీషన్లు దండుకుని ప్రాజెక్టులను మాత్రం పూర్తి చేయకుండా కోట్లాది రూపాయలు కొల్లగొట్టిందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆదానీ, అంబానీకు కొమ్ముకాస్తూ పేదప్రజలను విస్మరిస్తుందని విమర్శించారు. లాభాల్లో ఉన్న ఎల్ ఐ సి ని అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి నష్టాలకు గురి చేశారని ఆరోపించారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు. ఏసిడి చర్చీల పేరిట పేదలను దోచుకుంటున్న రాని,24గంటల పాటు ఉచిత విద్యుత్ పేరుతో అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతూ, రోజుకు కనీసం 6,7 గంటలు కూడా సరిగా ఇవ్వడం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో ఇందల్వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోత్కూర్ నవీన్ గౌడ్, కిసాన్ కేత్ జిల్లా అధ్యక్షులు ముప్పగంగారెడ్డి, రాష్ట్ర నాయకులు శేఖర్ గౌడ్, డిసిసి డెలిగేట్ సుధాకర్, కిసాన్ కేత్ మండల అధ్యక్షుడు గంగాధర్, లక్ష్మక్క, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్ బైరయ్య, ఆశిష్, కరు ణాకర్, బద్దం రెడ్డి , కుమ్మరి గంగాధర్ లారీ గంగన్న, రాజన్న,అంబర్ సింగ్,కర్స మోహన్, బాబురావు,వసంతరావు వెంగల్, సాయందర్, నారాయణ, వీరేందర్, గంగ నరసయ్య, శంషుద్దీన్,
రాజన్న, తోట ప్రకాష్, భూమన్న, ఎంపీ గంగన్న, శ్రీనివాస్, గబ్బర్ సింగ్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 07 Feb,2023 07:08PM