నవతెలంగాణ-డిచ్ పల్లి
బీజేపీ ఓబిసి జిల్లా అధ్యక్షులు యానంపల్లి మాజీ సర్పంచ్ యం శ్రీనివాస్ గౌడ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటనలో విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తి గత కారణాల వల్లా ఓబిసి జిల్లా అధ్యక్షుల పదవికి రాజీనామా చేస్తున్నట్లు, ఇప్పటి వరకు ఎంపి ధర్మపురి అరవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీ నర్సయ లకు, నిజామాబాద్ రూరల్ బీజేపీ ఇంచార్జీ దినేష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm