- తీరిన గురుకుల విద్యార్ధులు నీటి ఎద్దడి
నవతెలంగాణ - అశ్వారావుపేట
పరిష్కరించాలనే తలంపే ఉంటే ఎంతటి సమస్యకు అయినా మార్గం ఉంటుంది. గురుకుల విద్యార్ధులకు నీటి ఎద్దడి శీర్షికతో నవతెలంగాణలో బుధవారం ప్రచురితం అయిన కథనానికి స్పందన లభించింది. భవనం యజమాని మరమ్మత్తులకు నిరాకరించడంతో ప్రిన్సిపాల్ స్వప్న ఆగ మేఘాలు పై ఉన్నతాధికారులను సంప్రదించి నూతన మోటార్ ను ఏర్పాటు చేసారు. దీంతో బాలికలు నీటి వెతలు తీరాయి.
Mon Jan 19, 2015 06:51 pm