Mon January 19, 2015 06:51:29 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER

logo

అంతర్గత ప్రజాస్వామ్యమే మా బలం | Special Feature | CPI(M) 22nd Party Congress, Hyderabad | www.NavaTelangana.com

అంతర్గత ప్రజాస్వామ్యమే మా బలం

Fri 20 Apr 05:30:05.906146 2018

- పాలకపార్టీలతో పొత్తులు ఎప్పుడూ లేవు
-  బలమైన ప్రత్యామ్నాయం కోసం కృషి: సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
- సీపీఐ(ఎం) జాతీయ 22వ మహాసభల వార్తలు 2,12 పేజీల్లో..
నవతెలంగాణ- మహ్మద్‌ అమీన్‌ నగర్‌
అంతర్గత ప్రజాస్వామ్యం మాకున్న గొప్ప బలమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడంపై తమకు ఏకాభిప్రాయం ఉందని, రాజకీయంగా దీన్ని ఎలా సాధించాలనే అంశంపై 22వ అఖిలభారత మహాసభలో విస్తృత చర్చ జరుగుతున్నదని స్పష్టం చేశారు. పార్టీ రాజకీయ తీర్మానం ముసాయిదా ప్రతిని అన్ని భాషల్లో ముద్రించి రెండు నెలల కిందనే అన్ని శాఖలకూ పంపామని, దీనిపై పలు సవరణలు వచ్చాయని చెప్పారు. వీటన్నింటిపై శుక్రవారం మధ్యాహ్నం వరకు చర్చ జరుగుతుందని వివరించారు. మహాసభల్లో రెండు రకాల తీర్మానాలు ప్రవేశపెట్టలేదని, ఒకే తీర్మానం...రెండు రకాల అభిప్రాయాలు మాత్రమే మహాసభ ముందు ఉంచామని తెలిపారు. ముసాయిదా రాజకీయ తీర్మానంపై చర్చ శుక్రవారం మధ్యాహ్నాం వరకు ముగియనున్నదని, ఆ తరువాత రాజకీయ నిర్మాణ నివేదికను మహాసభ చర్చిస్తుందని ఆయన తెలిపారు. మహాసభలో రెండు రోజుల చర్చల వివరాలను గురువారం నాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియా గోష్టిలో వివరించారు. ముసాయిదా రాజకీయ తీర్మానాన్ని ప్రధాన కార్యదర్శి కాకుండా వేరొకరు పెట్టడం ఇది మొదటిసారి కాదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉదాహరణగా గతంలో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు, హరికిషన్‌సింగ్‌ సుర్జీత్‌ పెట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మైనారిటీ అభిప్రాయాన్ని ప్రధాన కార్యదర్శి మహాసభ ముందుంచడం ఇది వరకు ఎన్నడైనా జరిగిందా? అనే ప్రశ్నకు స్పందిస్తూ జ్యోతిబసును ప్రధానిని చేయాలా వద్దా అనే విషయమై పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో హరికిషన్‌సింగ్‌ సుర్జీత్‌ ఇదే విధంగా వ్యవహరించారని ఏచూరి బదులిచ్చారు. గతంలో నేషనల్‌ ఫ్రంట్‌, యూపీఏ ప్రభుత్వాలకు సీపీఐ(ఎం) బయటి నుంచే మద్దతు ఇచ్చింది తప్ప, ఎక్కడా వారితో పొత్తులు పెట్టుకోలేదని, ప్రభుత్వాల్లో భాగస్వామ్యం కాలేదని గుర్తుచేశారు. పాలకవర్గ పార్టీలతో పొత్తులు అనే అంశం సీపీఐ(ఎం) చరిత్రలోనే లేదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారానే నడుస్తోందని. దేశానికి కావల్సింది నేతలు కాదని...నీతి కావాలని చెప్పారు. పాలకవర్గ పార్టీల విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలను పెట్టగలిగేది వామపక్ష పార్టీలు మాత్రమేనని, వాటి ఐక్యతకు తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కర్నాటక ఎన్నికల్లో తాము పోటీచేయని నియోజకవర్గాల్లో బీజేపీని ఓడించాలని అక్కడి ఓటర్లకు చెబుతున్నామని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయ ముసాయిదా తీర్మానంపై తొలిరోజు 13 మంది ప్రతినిధులు చర్చలో పాల్గొన్నారని చెప్పారు. అలాగే 21వ అఖిలభారత మహాసభలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, ప్రజా ఉద్యమాలు, అనుభవాలు, పార్టీ నిర్మాణం వంటి అంశాలపై కూడా ఈ మహాసభలో చర్చ ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా అంశంపై తాము స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నామని, రాష్ట్ర విభజనకు ముందే పార్టీ తరఫున తాము లేవనెత్తిన అంశాలపై అప్పటి బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఎం వెంకయ్యనాయుడు... తాము అధికారంలోకి వస్తే పదేండ్లు ప్రత్యేక హోదా ఇచ్చి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై తాము ప్రత్యక్ష కార్యాచరణలో చురుగ్గానే పాల్గొంటున్నామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరతారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ...ఎన్నికలు సమీపించేకొద్దీ ఇలాంటి ఫ్రంట్లు చాలా పుట్టుకొస్తాయని, ప్రస్తుతం తాము వాటిపై దృష్టి పెట్టలేదని తెలిపారు.
ముసాయిదా రాజకీయ తీర్మానంపై చర్చలో 13 మంది ప్రతినిధులు
మహాసభలో ప్రవేశపెట్టిన పార్టీ రాజకీయ ముసాయిదా తీర్మానం, సవరణలపై గురువారం మధ్యాహ్నం వరకు జరిగిన చర్చలో 13 మంది ప్రతినిధులు పాల్గొన్నట్టు ఏచూరి చెప్పారు. చర్చల్లో పాల్గొన్నవారిలో పి రాజీవ్‌(కేరళ), శంతన్‌ఝా (వెస్ట్‌ బెంగాల్‌), తపన్‌ చక్రవర్తి(త్రిపుర), ఎమ్‌విఎస్‌ శర్మ (ఆంధ్రప్రదేశ్‌), ఆర్ముగ నయనార్‌ (తమిళనాడు), ఉదరు నర్వేల్‌కర్‌ (మహారాష్ట్ర), అరుణ్‌మిశ్రా(బీహార్‌), ఇంద్రజీత్‌ సింగ్‌ (హర్యానా), రాకేష్‌ సింగ్‌ (హిమాచల్‌ప్రదేశ్‌), ధూలిచంద్‌ (రాజస్థాన్‌), కెఎమ్‌ తివారి (ఢిల్లీ), సుప్రకాష్‌ తలుక్‌దార్‌ (అస్సాం) ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఈ ముసాయిదా తీర్మానంపై చర్చ కొనసాగుతుంది.న

అంతర్గత ప్రజాస్వామ్యమే మా బలం
అంతర్గత ప్రజాస్వామ్యమే మా బలం

- పాలకపార్టీలతో పొత్తులు ఎప్పుడూ లేవు
-  బలమైన ప్రత్యామ్నాయం కోసం కృషి: సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
- సీపీఐ(ఎం) జాతీయ 22వ మహాసభల వార్తలు 2,12 పేజీల్లో..
నవతెలంగాణ- మహ్మద్‌ అమీన్‌ నగర్‌
అంతర్గత ప్రజాస్వామ్యం మాకున్న గొప్ప బలమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడంపై తమకు ఏకాభిప్రాయం ఉందని, రాజకీయంగా దీన్ని ఎలా సాధించాలనే అంశంపై 22వ అఖిలభారత మహాసభలో విస్తృత చర్చ జరుగుతున్నదని స్పష్టం చేశారు. పార్టీ రాజకీయ తీర్మానం ముసాయిదా ప్రతిని అన్ని భాషల్లో ముద్రించి రెండు నెలల కిందనే అన్ని శాఖలకూ పంపామని, దీనిపై పలు సవరణలు వచ్చాయని చెప్పారు. వీటన్నింటిపై శుక్రవారం మధ్యాహ్నం వరకు చర్చ జరుగుతుందని వివరించారు. మహాసభల్లో రెండు రకాల తీర్మానాలు ప్రవేశపెట్టలేదని, ఒకే తీర్మానం...రెండు రకాల అభిప్రాయాలు మాత్రమే మహాసభ ముందు ఉంచామని తెలిపారు. ముసాయిదా రాజకీయ తీర్మానంపై చర్చ శుక్రవారం మధ్యాహ్నాం వరకు ముగియనున్నదని, ఆ తరువాత రాజకీయ నిర్మాణ నివేదికను మహాసభ చర్చిస్తుందని ఆయన తెలిపారు. మహాసభలో రెండు రోజుల చర్చల వివరాలను గురువారం నాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియా గోష్టిలో వివరించారు. ముసాయిదా రాజకీయ తీర్మానాన్ని ప్రధాన కార్యదర్శి కాకుండా వేరొకరు పెట్టడం ఇది మొదటిసారి కాదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉదాహరణగా గతంలో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు, హరికిషన్‌సింగ్‌ సుర్జీత్‌ పెట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మైనారిటీ అభిప్రాయాన్ని ప్రధాన కార్యదర్శి మహాసభ ముందుంచడం ఇది వరకు ఎన్నడైనా జరిగిందా? అనే ప్రశ్నకు స్పందిస్తూ జ్యోతిబసును ప్రధానిని చేయాలా వద్దా అనే విషయమై పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో హరికిషన్‌సింగ్‌ సుర్జీత్‌ ఇదే విధంగా వ్యవహరించారని ఏచూరి బదులిచ్చారు. గతంలో నేషనల్‌ ఫ్రంట్‌, యూపీఏ ప్రభుత్వాలకు సీపీఐ(ఎం) బయటి నుంచే మద్దతు ఇచ్చింది తప్ప, ఎక్కడా వారితో పొత్తులు పెట్టుకోలేదని, ప్రభుత్వాల్లో భాగస్వామ్యం కాలేదని గుర్తుచేశారు. పాలకవర్గ పార్టీలతో పొత్తులు అనే అంశం సీపీఐ(ఎం) చరిత్రలోనే లేదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారానే నడుస్తోందని. దేశానికి కావల్సింది నేతలు కాదని...నీతి కావాలని చెప్పారు. పాలకవర్గ పార్టీల విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలను పెట్టగలిగేది వామపక్ష పార్టీలు మాత్రమేనని, వాటి ఐక్యతకు తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కర్నాటక ఎన్నికల్లో తాము పోటీచేయని నియోజకవర్గాల్లో బీజేపీని ఓడించాలని అక్కడి ఓటర్లకు చెబుతున్నామని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయ ముసాయిదా తీర్మానంపై తొలిరోజు 13 మంది ప్రతినిధులు చర్చలో పాల్గొన్నారని చెప్పారు. అలాగే 21వ అఖిలభారత మహాసభలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, ప్రజా ఉద్యమాలు, అనుభవాలు, పార్టీ నిర్మాణం వంటి అంశాలపై కూడా ఈ మహాసభలో చర్చ ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా అంశంపై తాము స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నామని, రాష్ట్ర విభజనకు ముందే పార్టీ తరఫున తాము లేవనెత్తిన అంశాలపై అప్పటి బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఎం వెంకయ్యనాయుడు... తాము అధికారంలోకి వస్తే పదేండ్లు ప్రత్యేక హోదా ఇచ్చి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై తాము ప్రత్యక్ష కార్యాచరణలో చురుగ్గానే పాల్గొంటున్నామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరతారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ...ఎన్నికలు సమీపించేకొద్దీ ఇలాంటి ఫ్రంట్లు చాలా పుట్టుకొస్తాయని, ప్రస్తుతం తాము వాటిపై దృష్టి పెట్టలేదని తెలిపారు.
ముసాయిదా రాజకీయ తీర్మానంపై చర్చలో 13 మంది ప్రతినిధులు
మహాసభలో ప్రవేశపెట్టిన పార్టీ రాజకీయ ముసాయిదా తీర్మానం, సవరణలపై గురువారం మధ్యాహ్నం వరకు జరిగిన చర్చలో 13 మంది ప్రతినిధులు పాల్గొన్నట్టు ఏచూరి చెప్పారు. చర్చల్లో పాల్గొన్నవారిలో పి రాజీవ్‌(కేరళ), శంతన్‌ఝా (వెస్ట్‌ బెంగాల్‌), తపన్‌ చక్రవర్తి(త్రిపుర), ఎమ్‌విఎస్‌ శర్మ (ఆంధ్రప్రదేశ్‌), ఆర్ముగ నయనార్‌ (తమిళనాడు), ఉదరు నర్వేల్‌కర్‌ (మహారాష్ట్ర), అరుణ్‌మిశ్రా(బీహార్‌), ఇంద్రజీత్‌ సింగ్‌ (హర్యానా), రాకేష్‌ సింగ్‌ (హిమాచల్‌ప్రదేశ్‌), ధూలిచంద్‌ (రాజస్థాన్‌), కెఎమ్‌ తివారి (ఢిల్లీ), సుప్రకాష్‌ తలుక్‌దార్‌ (అస్సాం) ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఈ ముసాయిదా తీర్మానంపై చర్చ కొనసాగుతుంది.న

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

హైదరాబాద్ మహాసభల చైతన్యం 1964 ను గుర్తు చేస్తుంది:విఎస్

మహాసభ స్ఫూర్తితో ముందుకు..

ఎర్ర సైన్యం

సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా ఏచూరి

జజ్జనకరి జనారే.. డప్పుల జాతరే..

ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వానికి సంఘీభావం

విద్యను వ్యాపారంగా మార్చేందుకు బీజేపీ యత్నం

పాలస్తీనాకు మద్దతుగా మహాసభ తీర్మానం

సీపీఐ(ఎం) నేతలు ఏం మాట్లాడారు ?

మోడీ కో హఠావ్‌ దేశ్‌ బచావ్‌...

నికరంగా పోరాడుతాం... నిజాయితీగా నిలదీస్తాం!

బీజేపీని ప్రజలే గద్దె దింపుతారు

సమయం, సవాల్‌ ప్రమాదకరంగా ఉంది

మహసభల్లో సంక్లిష్ట రాజకీయాలపై చర్చ

ఎర్రజెండాతోనే... తెలంగాణలో ప్రజారాజ్యం

ఎర్రజెండా అండనుండగా.. దండు నడపరా!

బీజేపీ సర్కార్ నేరస్థుల రక్షకులు : బృందా

తెలంగాణ వచ్చింది? ఏమిచ్చింది? : తమ్మినేని

మోడీ కలలు కనటం మానుకో : బృందాకరత్

తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం :తమ్మినేని వీరభద్రం

తెలంగాణ లో ఎర్రజెండా రాజ్యం రావాలి : తమ్మినేని వీరభద్రం

ఆర్ఎస్ ఎస్ కను సన్నల్లో బీజేపీ నడుస్తోంది : మాణిక్ స‌ర్కా‌ర్‌

బీజేపీవి మతతత్వ రాజకీయాలు : పినరాయి

సామాజిక భద్రత కోసం కేరళ ప్రభుత్వం పనిచేస్తోంది : కేరళ సీఎం పినరాయి

సీపీఐ(ఎం) భారీ బహిరంగ సభ లైవ్‌

మోడీని గద్దెనుండి దింపుతామని సీపీఎం వాగ్దానం : ఏచూరి

మళ్లీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు : సీతారాం ఏచూరి

బీ.వీ రాఘవులు అధ్యక్షతన పొలిట్ బ్యూరో 'రెడ్ సెల్యూట్' ..

సరూర్ నగర్ చేరుకున్న ఎర్ర కవాతు..

సభా ప్రాంగణానికి చేరుకున్న మాణిక్ సర్కార్, కేరళ సీఎం

సీపీఐ(ఎం) మహాసభకు పోటెత్తిన జనం..

సీపీఎం బహిరంగ సభ లైవ్‌

95 మందితో సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ (పూర్తి వివరాలు)

సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ‌లోకి నాగయ్య, కంట్రోల్ కమీషన్ లోకి జి రాములు

సీసీఎం బహిరంగ సభ...భారీ బందోబస్తు

ఉన్నత విద్యపై జరుగుతున్న దాడులపై సిపిఐ(ఎం) మహాసభ తీర్మానం

ఐదుగురు సభ్యులతో సిపిఐ(ఎం)కేంద్ర కంట్రోల్ కమీషన్

17మందితో సిపిఐ(ఎం)‌ పొలిట్ బ్యూరో వివరాలు..

సిపిఐ(ఎం) కేంద్రకమిటీ లోకి తెలంగాణ నుండి నలుగురు

17మందితో సిపిఐ(ఎం)‌ పొలిట్ బ్యూరో...

మహాసభలో అగ్రనేతలు ప్రసంగాలు

సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరీ ఏకగ్రీవం

95 మందితో సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

పాలస్తీనా సమస్యపై సిపిఐ(ఎం) మహాసభలో తీర్మానం

సీపీఎం కళాకారుల డప్పు ప్రదర్శన.. (ఫోటో గ్యాలరీ)

సిపిఐ(ఎం)‌ మహాసభల ప్రాంగాణంలో కళాకారుల కోలాహలం

సరూర్‌నగర్‌ స్టేడియంలో సీపీఎం భారీ బహిరంగ సభ

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి

సిపిఐ(ఎం) మహాసభలు - నవతెలంగాణ ప్రింట్(22 ఎప్రియల్) కవరేజ్

వికలాంగుల హక్కుల చట్టాల అమలుకు పోరాటం

మహిళా బిల్లుకు బీజేపీ ద్రోహం

నిన్న గోరక్షక్‌.. నేడు రేపిస్టు రక్షక్‌

కేరళ పాలన.. అన్నింటా ఆదర్శం

దేశానికి దశ, దిశ, నిర్దేశం

తీవ్రవాదం పీచమణిచాం

రుచికిరుచీ.. శుచికిశుచీ..

ప్రజల కోసమే పార్టీ

ఐక్య ఉద్యమాలతోనే..

జలియన్‌వాలాబాగ్‌కు నూరేండ్లు

బతుకుదెరువు

ఎస్సీ, ఎస్టీ‌ అట్రాసిటీ‌ చట్టం, దళితులపై దాడులపై సిపిఐ(ఎం)‌ తీర్మానం

జలియన్ వాలాబాగ్ స్మృతిలో సిపిఐ(ఎం)‌ మహాసభ తీర్మానం

ఎస్సీ, ఎస్టీ‌ అట్రాసిటీ‌ చట్టం, దళితులపై దాడులపై సిపిఐ(ఎం)‌ తీర్మానం

జలియన్ వాలాబాగ్ స్మృతిలో సిపిఐ(ఎం)‌ మహాసభ తీర్మానం

సిపిఐ(ఎం) రాజకీయ తీర్మానం పై స్పష్టతనిచ్చిన బృందాకారత్

సిపిఐ(ఎం)‌ మహాసభల్లో మూడు తీర్మానాలు ఆమోదం

సిపిఐ(ఎం)‌ బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర నాయకత్వం

బీజేపీని గద్దె దించటమే సీపీఎం ప్రధాన లక్ష్యం: బృందాకరత్

మాది మిస్డ్ కాల్ మెంబర్ షిప్ కాదు : బృందా కరత్

మహిళా హక్కుల తీర్మానానికి మహాసభ ఆమోదం : బృందకరత్

సిపిఐ(ఎం) మహాసభల్లో తెలంగాణ మహిళా ప్రతినిధులు

భారత సీపీఐ(ఎం) మహాసభలకు క్యూ‌బా కమ్యూనిస్టు పార్టీ సంఘీభావం

భారత సీపీఐ(ఎం) మహాసభలకు వెనిజులా కమ్యూనిస్టు పార్టీ సంఘీభావం

భారత సీపీఐ(ఎం) మహాసభలకు చైనా కమ్యూనిస్టు పార్టీ సంఘీభావం

కార్మిక హక్కులను హరించే నోటిఫికేషన్లు ఉపసంహరించాలి

సిరియాపై దురాక్రమణకు అమెరికా, నాటో బరితెగింపు

'మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌' ర్యాలీకి సీపీఐ (ఎం) మద్దతు

త్రిపురలో బీభత్సకాండను తిప్పికొట్టాలి

15వ ఆర్థిక సంఘ పరిశీలనాంశాలు సమాఖ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టు

సిపిఐ(ఎం) మహాసభలు - నవతెలంగాణ ప్రింట్(21 ఎప్రియల్) కవరేజ్

కాంగ్రెస్‌తో పొత్తు లేదు

సోషల్‌ మీడియాపై ఆంక్షలేల?

సిరియాపై దురాక్రమణకు అమెరికా, నాటో బరితెగింపు

కార్మికహక్కుల్ని కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం

విమర్శలోనూ హిందూ, పెత్తందారీ సంస్కృతి

15వ ఆర్థిక సంఘం విధి విధానాలు సమాఖ్య వ్యవస్థపై దాడి

'మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌' ర్యాలీకి సీపీఐ (ఎం) మద్దతు

The CPI(M) 22nd Congress adopted the main Political Resolution

ఏకగ్రీవంగా సిపిఐ(ఎం) రాజకీయ తీర్మానం ఆమోదం

మూడోరోజు సీపీఎం జాతీయ మహాసభలు (ఫోటో గ్యాలరీ)

సిపిఐ(ఎం) నిర్మాణ నివేదిక ప్రవేశపెట్టిన రామచంద్రన్ పిళ్లై

నిర్బంధాల్ని తట్టుకుని ముందుకు..

ప్రజలు శాంతి కోరుకుంటున్నారు:సిపిఐ(ఎం) కాశ్మీర్ కార్యదర్శి తరిగామి

సీపీఎం 22వ అఖిలభారత మహాసభలు (ఫోటో గ్యాలరీ)

బీజేపీని ఓడించేందుకు చర్యలు :కరత్

పార్టీలో విభేదాలున్నాయన్నది భ్రమే : ప్రకాశ్ కారత్

సీపీఎం జాతీయ మహాసభలు..కీలక అజెండా...

సిపిఐ(ఎం)‌మహాసభల్లో మూడవ రోజు తీర్మానాలు

మూడో రోజు కోనసాగుతున్న సీపీఎం జాతీయ మహసభలు (ఫోటో గ్యాలరీ)

అంతర్గత ప్రజాస్వామ్యమే మా బలం

ముసాయిదాకు రికార్డు స్థాయిలో సవరణలు

కిసాన్‌ లాంగ్‌మార్చ్‌ మహా స్ఫూర్తి

సాంస్కృతిక రంగంపై దృష్టి

నిర్బంధాల్ని తట్టుకుని ముందుకు..

ది కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌ మహారాష్ట్ర పుస్తకావిష్కరణ

ఎందులోనూ... గుజరాత్‌ మోడల్‌ కాదు

ప్రజలు శాంతి కోరుకుంటున్నారు

కమ్యూనిస్టు పార్టీల సంఘీభావం

పెచ్చరిల్లుతున్న లైంగిక హింస

బీజేపీ పాలనలో మరింత దాడులు : సుభాషిణి ఆలీ

సిపిఐ(ఎం) అఖిలభారత మహాసభలో థింసా కళాకారుల నృత్యం

కొనసాగుతున్న సిపిఎం జాతీయ మహాసభలు

జస్టీస్ లోయ కేసు దర్యాప్తు పై సిపిఐ(ఎం) మహాసభ తీర్మానం

జస్టీస్ లోయ కేసు దర్యాప్తు పై సిపిఐ(ఎం) మహాసభ తీర్మానం

సిపిఐ(ఎం)‌ మహాసభలలో రాజకీయ ముసాయిదాపై కొనసాగుతున్న చర్చలు

జస్టిస్ లోయా మృతిపై సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరం : ఏచూరి

ఎన్నికల పొత్తుపై స్పష్టతనిచ్చిన ఏచూరి

సిపిఐ(ఎం) మహాసభలు - నవతెలంగాణ ప్రింట్(19 ఎప్రియల్) కవరేజ్

రెండో రోజు కొనసాగుతున్న సిపిఎం జాతీయ మహాసభలు

పేదరికం నుంచి రాజకీయాల్లోకి..

రక్షణ లేని మోడీ ఏలుబడి

వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల బలోపేతమే ప్రత్యామ్నాయం

అమరవీరులకు నివాళి

ఉత్సాహ ప్రచారం.. ఊరూరా నినాదం

పెరిగిన మహిళా ప్రాతినిధ్యం

చరిత్రను తిరగరాసేది పోరాటాలే..

మక్కా మసీదు పేలుళ్ల కేసు తీర్పుపై సిపిఐ(ఎం)‌ మహాసభలో తీర్మానం

మక్కా మసీదు పేలుళ్ల కేసు తీర్పుపై సిపిఐ(ఎం)‌ మహాసభలో తీర్మానం

సిపిఐ(ఎం) రాజకీయ ముసాయిదా ప్రవేశపెట్టిన కారత్

బిజెపి పాలనలో పెరిగిన నియంతృత్వ దాడులు: ఏచూరి

మహాసభల్లో ఎమ్మెల్యే తరిగామి...

అమరవీరులకు సిపిఐ(ఎం)‌ అగ్ర నాయకత్వం నివాళి (చిత్రమాలిక)...

సిపిఐ(ఎం)‌ మహాసభల ప్రతినిధుల సభకు వివిధ కమిటీల ఎన్నిక

ప్రారంభమైన సిపిఐ(ఎం)‌ ప్రతినిధులసభ

సీపీఎం 22వ మహాసభలు (ఫోటో గ్యాలరీ)

రెండు కోట్ల ఉద్యోగాలేవి : జీఆర్ శివశంకర్

మహాసభల్లో సీపీఐ ఎంఎల్ నేత...

తెలంగాణ సాయుధ పోరాటం నేటికీ మాకు స్ఫూర్తి : బివి.రాఘవులు

సిపిఐ(ఎం) మహాసభల్లో అధ్యక్షోపన్యసం చేసిన మాణిక్ సర్కార్

కమ్మ్యూనిస్ట్ వెటరన్స్ ను సన్మానించిన సిపిఐ(ఎం) మహాసభ

లెఫ్ట్‌ ఐక్యత ఇప్పుడు అవసరం : సురవరం సుధాకర్‌

సిపిఐ(ఎం)‌ మహాసభల్లో అమరవీరులకు నివాళిగా కళకారులు

సీపీఎం మహాసభల్లో సందేశం వినిపిస్తున్న మనోజ్‌ భట్టాచార్య

సిపిఐ(ఎం) మహాసభల్లో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన మాణిక్ సర్కార్

కథువా వంటి ఘటనలు దురదృష్టకరం: సీతారాం ఏచూరీ

సిపిఐ(ఎం) మహాసభల్లో రాఘవులు స్వాగతోపన్యసం

సీపీఐ(ఎం) 22వ మహాసభలు (లైవ్‌)

సీపీఎం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన మల్లు స్వరాజ్యం

సిపిఎం మహాసభలు మరికొద్ది సేపట్లో...

నేటి నుంచి సీపీఐ (ఎం) మహాసభలు

మహాసభల్లో మతోన్మాదంపైనే రాజకీయ చర్చ

విస్తృతం...వినూత్నం

మహానగరం అరుణారుణం..

మహాసభలో మొత్తం 25 తీర్మానాలు..

ఆర్టీసీ కళ్యాణ మంటపం పరిసర ప్రాంతాలు అరుణవర్ణం

మహాసభలు-కార్యదర్శులు-కీలక నిర్ణయాలు

మహాసభ నిర్ణయాలు దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయి...

ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు..

సామాజిక న్యాయం..ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం..

మతోన్మాదం, ప్రపంచీకరణల బంధం వీడదీయరానిది

మతోన్మాదం, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఉధృత పోరాటాలు

ప్రజాపోరాటాలు ప్రతిబింబించేలా సీపీఐ(ఎం) మహాసభలు

వేగంగా సీపీఐ(ఎం) మహాసభ ఏర్పాట్లు

మహాసభల నేపథ్యంలో సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశం

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.