Mon January 19, 2015 06:51:29 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER

logo

కేరళ పాలన.. అన్నింటా ఆదర్శం | Special Feature | CPI(M) 22nd Party Congress, Hyderabad | www.NavaTelangana.com

కేరళ పాలన.. అన్నింటా ఆదర్శం

Sun 22 Apr 06:23:51.941671 2018

- హక్కులను హరిస్తున్న కేంద్రం
- మానవాభివృద్ధి సూచి మెరుగుదలే అసలైన అభివృద్ధి
- ఆ లక్ష్యంతోనే పలు కార్యక్రమాలు: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌
* ములాఖాత్‌
ప్రభుత్వ ప్రాజెక్టులకు అవసరమయ్యే భూముల సేకరణలో పారదర్శకత పాటిస్తున్నామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. నష్ట పరిహారం, సహాయ పునరావాసం విషయంలో రైతులు, నిర్వాసితులతో చర్చలు జరిపి ఏకాభిప్రాయం సాధించిన తర్వాతనే భూములు సేకరిస్తున్నామన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యంత ఎక్కువ మొత్తంలో పరిహారం ఇస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని, దీంతో ఆదాయ వనరులు దెబ్బతింటున్నాయని తెలిపారు. కేంద్రం సహాయ నిరాకరణ పాటిస్తోందన్నారు. ప్రజల అభివృద్ధి అంటే మానవాభివృద్ధి సూచి మెరుగుదల అని, అందుకోసం అన్ని వర్గాలనూ దృష్టిలో పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని వివరించారు. సీపీఐ(ఎం) 22వ మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన పినరయి నవతెలంగాణ ప్రతినిధి ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రికి ఇంటర్వూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే...
గత యూడీఎఫ్‌ ప్రభుత్వాల కంటే ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం ఏఏ అంశాల్లో విభిన్నంగా ఉంది? చేపట్టిన ప్రత్యామ్నాయ విధానాలేమిటి?
కేరళలో సహజవనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రజలు మెరుగైన విద్య, ఆరోగ్య అవసరాలు తీర్చాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వరంగంలో ఈ అవసరాలు తీరాలంటున్నారు. కేరళ ప్రజలు విద్యాపరంగా, రాజకీయపరంగా చైతన్యం కలవారు. ప్రజల ఆకాంక్షలను మా ప్రభుత్వం గుర్తించింది. సామాజిక, ఆర్థిక రంగాల్లో సుస్థిర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా పని చేస్తోంది. ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదపడే వ్యవసాయం, అనుబంధ, పారిశ్రామిక రంగాల్లో కొత్త టెక్నాలజీని, నైపుణ్యాన్ని పెంపెందించేందుకు కృషి చేస్తోంది. రానున్న 15 ఏండ్లలో పర్యావరణ అనుకూల ఆర్థికాభివృద్ధి, ఉన్నతస్థాయిలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు.
ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూముల సేకరణ ఎలా జరుపుతున్నారు? రైతులకు, భూములపై ఆధారపడ్డ వారికి ఏ విధంగా సహాయ, పునరావాసం అందజేస్తున్నారు?
- ప్రజల సామూహిక అవసరాల కోసం మాత్రమే రైతుల నుంచి భూములు సేకరిస్తున్నాం. సముచిత స్థాయిలో నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పిస్తున్నాం. ఈ విషయంలో మాకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. భూసేకరణలో రాజకీయ జోక్యం ఉండదు. రైతులతో చర్చలు చేసి ఏకాభిప్రాయం సాధిస్తున్నాం. జాతీయ రహదారుల కోసం భూములు సేకరిస్తున్న సందర్భాల్లో ఇతర రాష్ట్రాలు కిలోమీటరుకు రూ.65 లక్షలు చెల్లిస్తుండగా కేరళ సర్కారు రూ.ఏడు కోట్లు చెల్లిస్తోంది.
సహకార వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
- రాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంక్‌, 14 జిల్లా కోఆపరేటివ్‌ బ్యాంకులనన్నింటినీ విలీనం చేసి కేరళ బ్యాంకును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించాం. దీనిద్వారా సహకార వ్యవస్థను పటిష్టం చేయాలనుకున్నాం. అధ్యయనానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశాం.
పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వలన ఏమైనా ఇబ్బందులొచ్చాయా?
- పెద్ద నోట్ల రద్దు వలన సహకార రంగ బ్యాంకులు, సంస్థలకు ఇబ్బందులొచ్చాయి. రద్దయిన పాత నోట్లను కోఆపరేటివ్స్‌ తీసుకోవద్దని ఆర్‌బిఐ ఆంక్షలు పెట్టింది. మా ప్రభుత్వం జోక్యం చేసుకొని గ్యారంటీ ఇచ్చి 1,400 సహకార సంస్థల్లో పాత నోట్లు స్వీకరించేలా చేసింది. దీంతో డిపాజిట్‌ విశ్వాసం కలిగింది. కేంద్రం, ఆర్‌బిఐలు మాకు ఏమాత్రం సహకరించలేదు.
ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడిఎస్‌) పరిపుష్టికి ఏం చేస్తున్నారు?
- పిడిఎస్‌ను సమర్ధవంతంగా అమలు చేసేందుకు బడ్జెట్‌ కేటాయింపులు పెంచాం. అందుకోసం రూ.150 కోట్లు ప్రత్యేకంగా కేటాయించాం. బ్లాక్‌మార్కెట్‌ను, దళారులను అరికట్టాం. ఆహారభద్రతా చట్టం అమలులో భాగంగా ఆహారధాన్యాలు, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందిస్తున్నాం. పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. మవేలి స్టోర్స్‌, నీతి స్టోర్స్‌, సివిల్‌సప్లయిస్‌ అవుట్‌లెట్ల ద్వారా నిత్యావసరాలను అందుబాటులో ఉంచి ధరలు పెరగకుండా చేస్తున్నాం.
నిరుద్యోగులకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి కల్పనకు ఏ విధమైన చర్యలు చేపట్టారు?
- యుడిఎఫ్‌ సర్కారు కొత్త ఉద్యోగాల భర్తీపై నిషేధం విధించగా మేం వచ్చాక నిషేధం ఎత్తేశాం. ఏఏ శాఖల్లో ఖాళీలున్నాయో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నుంచి రిపోర్టు తెప్పించుకున్నాం. సంవత్సరంన్నరలో 68 వేల పోస్టులు భర్తీ చేశాం. ప్రభుత్వరంగ సంస్థల్లో రెండు లక్షల మంది యువకులకు ఉద్యోగాలిచ్చాం. ప్రభుత్వరంగంలో 2,400 కొత్త పోస్టులను సృష్టించాం. యుడిఎఫ్‌ సర్కారు 13 ప్రభుత్వరంగ సంస్థలను మూతేయగా మేమొచ్చాక వాటిని తెరిపిచాం. దీనివలన చాలా మందికి ఉద్యోగ అవకాశం కలిగింది.
ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'హరిత కేరళ' లక్ష్యాలేమిటి?
ప్రజల అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణను ఒక ఇరుసుగా చేయడం, జీవ వైవిధ్యాన్ని కాపాడటం, నీటి వనరుల లభ్యత పెంపు... ఇవీ హరిత కేరళ ప్రధాన లక్ష్యాలు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు హరిత కేరళ మిషన్‌ను నెలకొల్పాం. విద్యా మిషన్‌లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరూ గౌరవ ప్రదంగా జీవించేలా గృహ వసతి కల్పిస్తున్నాం. మానవాభివృద్ధి సూచి మెరుగుదల కోసం బడ్జెట్‌లో అధికంగా ఖర్చు చేస్తున్నాం. జిఎస్‌డిపిలో రాష్ట్ర పర్యాటకరంగం వాటా పది శాతం.
రాష్ట్రాల ఆర్థిక పరిపుష్టికి కేంద్ర సహకారం అందుతోందా?
కేంద్ర విధానాల వలన రాష్ట్రాల ఆదాయం తగ్గుతోంది. 15వ ఆర్థిక సంఘానికి కేంద్రం నిర్ధేశించిన పరిశీలనాంశాలకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలను ఒకే తాటిపై తీసుకొచ్చేందుకుగాను ఇటీవల సమావేశం నిర్వహించాం. కేంద్రం ఇష్టారాజ్యంగా అమలు చేస్తున్న విధానాల వలన పన్నుల ద్వారా రాష్ట్రానికి సమకూరే ఆదాయం పడిపోతోంది. ఆర్థిక వనరులు దెబ్బతింటున్నాయి. జిఎస్‌టి వలన రాష్ట్ర ఆదాయం 9 శాతం పడిపోయింది. కేంద్రం ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోంది.
వివిధ వర్గాలకు సంక్షేమ పింఛన్లు ఇస్తున్నారు...?
-ఎల్‌డిఎఫ్‌ సర్కారు వచ్చాక 27 రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. వివిధ వర్గాలకు సంక్షేమ పింఛన్లను అమలు చేస్తున్నాం. నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు పింఛన్లు పంపుతున్నాం. వ్యవసాయ కార్మికులకు పింఛన్లు ఇవ్వడంతో పాటు ప్రతి ఏడాదీ పింఛను మొత్తాన్నీ పెంచుతున్నాం.
కేరళ ప్రవాసీ పెన్షన్‌ స్కీం గురించి వివరించండి...
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయుల సంక్షేమం కోసం ఈ పథకం ఉద్దేశించబడింది. ఈ పథకానికి రూపకల్పన చేయడానికి ముందు అన్ని దేశాల్లో ఉన్న కేరళీయులతో సంప్రదింపులు జరిపాం. దీనికి 'లోక కేరళ సభ' అని నామకరణం చేశాం. విదేశాల్లోని భారతీయుల ద్వారా జాతీయ, రాష్ట్ర ఖజానాకు ఆర్ధిక వనరులు సమకూరుతున్నాయి. ఈ వనరుల్ని రాష్ట్ర అభివృద్ధితో పాటు వ్యక్తిగత ఆర్ధిక భద్రతను కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. విదేశాల నుంచి ఆర్ధిక భారాలతో తిరిగి వచ్చిన వారికి ప్రభుత్వమే పెన్షన్‌ ఇస్తుంది. ఒకవేళ తాత్కాలికంగా పెన్షన్‌ వద్దనుకుంటే వారికి చెల్లించే సొమ్ముకు నిర్ణీత గడువు తర్వాత నాలుగురెట్లకు పెంచి ఏకమొత్తంగా అందించే వెసులుబాటు కూడా ఈ స్కీంలో ఉంది. దీనివల్ల కేరళీయులు ఎవరూ ఆర్ధికంగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండవు. ఈ స్కీంకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. విదేశాల నుంచి స్వరాష్ట్రానికి వచ్చాక వారి నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ ఇక్కడే ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
వివిధ అభివృద్ధి పథకాలకు నిధులను ఎలా సమకూరుస్తున్నారు?
- రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పన, సంక్షేమ పథకాలకు ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులు ఏ మాత్రం సరిపోవు. ఈ సవాలును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ బోర్డ్‌ (కెఐఐఎఫ్‌బీ)ను ఏర్పాటు చేశాం. ఐదేండ్లలో రూ.50వేల కోట్లు సమీకరించాలనేది లక్ష్యం. బడ్జెట్‌కు దీనికి సంబంధం లేదు. దీనిలో పెట్టుబడులు పెట్టేవారు తొలుత తమ ప్రాంతాల్లోని అభివృధ్ధి పనులను ఎంపిక చేసుకుంటారు. తర్వాతి క్రమంలో పెట్టుబడి మూలధనానికి వడ్డీని కూడా పొందే అవకాశం ఉంది. బోర్డుకు వచ్చే పెట్టుబడులకు రాష్ట్రప్రభుత్వం డిపాజిట్‌ గ్యారంటీ ఇస్తుంది. స్వీయ సంప్రదాయ వనరుల వినియోగం, సంక్షేమ ప్రమాణాల రూపకల్పన, నిర్వహణకు కేఐఐఎఫ్‌బీకి జవాబుదారీతనంతో కూడిన పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది.
బాలికలు, మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి?
- చరిత్రలో తొలిసారిగా మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వారి భద్రత, సంరక్షణకు దీర్ఘకాల ప్రణాళికల్ని అమలు చేస్తున్నాం. పింక్‌ పెట్రోల్‌ పేరుతో పట్టణాల్లో మహిళా సమస్యల పరిష్కారం, భద్రతను అందిస్తున్నాం. పోలీస్‌ ట్రాకింగ్‌ సిస్టం ఉంది. పెట్రోలింగ్‌ వాహనాలకు జీపీఎస్‌ సిస్టంను అనుసంధానం చేశాం. నిర్భయ 24/7 పేరుతో హెల్ప్‌డెస్క్‌, హెల్ప్‌లైన్‌ నెంబర్లు, జిల్లా మహిళా సెల్‌లో మహిళా సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లను నియమించాం. మహిళలు, బాలికల రక్షణకోసం రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యల్లో ఇవి కొన్ని మాత్రమే.
దేవాలయాల్లో దళిత పూజారులకు రిజర్వేషన్లు కల్పించారు...వాటి అనుభవాలు ఏంటి?
- సంప్రదాయ దేవాలయాల్లో దళిత పూజారులకు రిజర్వేషన్లు కల్పించాం. చారిత్రకంగా ఇదో ముందడుగు. ఒకప్పుడు దళితులకు ఆలయ ప్రవేశం కూడా లేకుండా ఉండేది. ఈ నిర్ణయాన్ని తొలుత కులాల ప్రాతిపదికగా హిందుత్వ శక్తులు, సంఫ్‌ుపరివార్‌ వంటి సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ క్రమేణా ప్రభుత్వ నిర్ణయాన్ని అవి కూడా స్వాగతించాల్సి వచ్చింది. సాంఘీక సంస్కరణల్లో ఇదే మైలురాయి.
దళితులు, ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి?
- శీఘ్ర నియామకాల పథకం క్రింద వందలాదిమంది ఆదివాసీ యువకుల్ని పోలీస్‌ ఫోర్స్‌ల్లో రిక్రూట్‌మెంట్‌ చేశాం. మారుమూల ప్రాంతాలు, చిట్టడువుల్లో నివసిస్తున్న గిరిజనుల కుటుంబాల్లోని యువకుల్ని తొలివిడతలో రిక్రూట్‌ చేశాం. ఆయా గిరిజన తాండాల్లోని యువతీ, యువకులు చదువుకొనేందుకు ఆర్ధిక సహాయాన్ని అందిస్తూ, విద్యుత్‌ సౌకర్యం కల్పించాం. వారి ఆసక్తిని బట్టి పక్కా గృహాలు, భూముల్ని కేటాయించాం.
వలస కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి?
- దేశంలోనే తొలిసారిగా వలస కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేశాం. ప్రదాన కేంద్రాల్లో షెల్టర్లు ఏర్పాటు చేసి, సేవల్ని అందిస్తున్నాం. వారందరికీ మెడికల్‌ అసిస్టెన్స్‌ స్కీంను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నాం.
కేరళ రాష్ట్రంలో కనీస వేతనం రూ.18 వేలు చెల్లిస్తున్నారా?
- కార్మికులకు కనీస వేతనాల నిర్ణయంపై చర్చలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దీన్ని కచ్చితంగా అమలు చేస్తున్నాం. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరింపచేస్తాం.

కేరళ పాలన.. అన్నింటా ఆదర్శం

- హక్కులను హరిస్తున్న కేంద్రం
- మానవాభివృద్ధి సూచి మెరుగుదలే అసలైన అభివృద్ధి
- ఆ లక్ష్యంతోనే పలు కార్యక్రమాలు: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌
* ములాఖాత్‌
ప్రభుత్వ ప్రాజెక్టులకు అవసరమయ్యే భూముల సేకరణలో పారదర్శకత పాటిస్తున్నామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. నష్ట పరిహారం, సహాయ పునరావాసం విషయంలో రైతులు, నిర్వాసితులతో చర్చలు జరిపి ఏకాభిప్రాయం సాధించిన తర్వాతనే భూములు సేకరిస్తున్నామన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యంత ఎక్కువ మొత్తంలో పరిహారం ఇస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని, దీంతో ఆదాయ వనరులు దెబ్బతింటున్నాయని తెలిపారు. కేంద్రం సహాయ నిరాకరణ పాటిస్తోందన్నారు. ప్రజల అభివృద్ధి అంటే మానవాభివృద్ధి సూచి మెరుగుదల అని, అందుకోసం అన్ని వర్గాలనూ దృష్టిలో పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని వివరించారు. సీపీఐ(ఎం) 22వ మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన పినరయి నవతెలంగాణ ప్రతినిధి ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రికి ఇంటర్వూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే...
గత యూడీఎఫ్‌ ప్రభుత్వాల కంటే ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం ఏఏ అంశాల్లో విభిన్నంగా ఉంది? చేపట్టిన ప్రత్యామ్నాయ విధానాలేమిటి?
కేరళలో సహజవనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రజలు మెరుగైన విద్య, ఆరోగ్య అవసరాలు తీర్చాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వరంగంలో ఈ అవసరాలు తీరాలంటున్నారు. కేరళ ప్రజలు విద్యాపరంగా, రాజకీయపరంగా చైతన్యం కలవారు. ప్రజల ఆకాంక్షలను మా ప్రభుత్వం గుర్తించింది. సామాజిక, ఆర్థిక రంగాల్లో సుస్థిర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా పని చేస్తోంది. ప్రజల ఆర్థికాభివృద్ధికి దోహదపడే వ్యవసాయం, అనుబంధ, పారిశ్రామిక రంగాల్లో కొత్త టెక్నాలజీని, నైపుణ్యాన్ని పెంపెందించేందుకు కృషి చేస్తోంది. రానున్న 15 ఏండ్లలో పర్యావరణ అనుకూల ఆర్థికాభివృద్ధి, ఉన్నతస్థాయిలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు.
ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూముల సేకరణ ఎలా జరుపుతున్నారు? రైతులకు, భూములపై ఆధారపడ్డ వారికి ఏ విధంగా సహాయ, పునరావాసం అందజేస్తున్నారు?
- ప్రజల సామూహిక అవసరాల కోసం మాత్రమే రైతుల నుంచి భూములు సేకరిస్తున్నాం. సముచిత స్థాయిలో నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పిస్తున్నాం. ఈ విషయంలో మాకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. భూసేకరణలో రాజకీయ జోక్యం ఉండదు. రైతులతో చర్చలు చేసి ఏకాభిప్రాయం సాధిస్తున్నాం. జాతీయ రహదారుల కోసం భూములు సేకరిస్తున్న సందర్భాల్లో ఇతర రాష్ట్రాలు కిలోమీటరుకు రూ.65 లక్షలు చెల్లిస్తుండగా కేరళ సర్కారు రూ.ఏడు కోట్లు చెల్లిస్తోంది.
సహకార వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
- రాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంక్‌, 14 జిల్లా కోఆపరేటివ్‌ బ్యాంకులనన్నింటినీ విలీనం చేసి కేరళ బ్యాంకును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించాం. దీనిద్వారా సహకార వ్యవస్థను పటిష్టం చేయాలనుకున్నాం. అధ్యయనానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశాం.
పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వలన ఏమైనా ఇబ్బందులొచ్చాయా?
- పెద్ద నోట్ల రద్దు వలన సహకార రంగ బ్యాంకులు, సంస్థలకు ఇబ్బందులొచ్చాయి. రద్దయిన పాత నోట్లను కోఆపరేటివ్స్‌ తీసుకోవద్దని ఆర్‌బిఐ ఆంక్షలు పెట్టింది. మా ప్రభుత్వం జోక్యం చేసుకొని గ్యారంటీ ఇచ్చి 1,400 సహకార సంస్థల్లో పాత నోట్లు స్వీకరించేలా చేసింది. దీంతో డిపాజిట్‌ విశ్వాసం కలిగింది. కేంద్రం, ఆర్‌బిఐలు మాకు ఏమాత్రం సహకరించలేదు.
ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడిఎస్‌) పరిపుష్టికి ఏం చేస్తున్నారు?
- పిడిఎస్‌ను సమర్ధవంతంగా అమలు చేసేందుకు బడ్జెట్‌ కేటాయింపులు పెంచాం. అందుకోసం రూ.150 కోట్లు ప్రత్యేకంగా కేటాయించాం. బ్లాక్‌మార్కెట్‌ను, దళారులను అరికట్టాం. ఆహారభద్రతా చట్టం అమలులో భాగంగా ఆహారధాన్యాలు, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందిస్తున్నాం. పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. మవేలి స్టోర్స్‌, నీతి స్టోర్స్‌, సివిల్‌సప్లయిస్‌ అవుట్‌లెట్ల ద్వారా నిత్యావసరాలను అందుబాటులో ఉంచి ధరలు పెరగకుండా చేస్తున్నాం.
నిరుద్యోగులకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి కల్పనకు ఏ విధమైన చర్యలు చేపట్టారు?
- యుడిఎఫ్‌ సర్కారు కొత్త ఉద్యోగాల భర్తీపై నిషేధం విధించగా మేం వచ్చాక నిషేధం ఎత్తేశాం. ఏఏ శాఖల్లో ఖాళీలున్నాయో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నుంచి రిపోర్టు తెప్పించుకున్నాం. సంవత్సరంన్నరలో 68 వేల పోస్టులు భర్తీ చేశాం. ప్రభుత్వరంగ సంస్థల్లో రెండు లక్షల మంది యువకులకు ఉద్యోగాలిచ్చాం. ప్రభుత్వరంగంలో 2,400 కొత్త పోస్టులను సృష్టించాం. యుడిఎఫ్‌ సర్కారు 13 ప్రభుత్వరంగ సంస్థలను మూతేయగా మేమొచ్చాక వాటిని తెరిపిచాం. దీనివలన చాలా మందికి ఉద్యోగ అవకాశం కలిగింది.
ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'హరిత కేరళ' లక్ష్యాలేమిటి?
ప్రజల అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణను ఒక ఇరుసుగా చేయడం, జీవ వైవిధ్యాన్ని కాపాడటం, నీటి వనరుల లభ్యత పెంపు... ఇవీ హరిత కేరళ ప్రధాన లక్ష్యాలు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు హరిత కేరళ మిషన్‌ను నెలకొల్పాం. విద్యా మిషన్‌లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరూ గౌరవ ప్రదంగా జీవించేలా గృహ వసతి కల్పిస్తున్నాం. మానవాభివృద్ధి సూచి మెరుగుదల కోసం బడ్జెట్‌లో అధికంగా ఖర్చు చేస్తున్నాం. జిఎస్‌డిపిలో రాష్ట్ర పర్యాటకరంగం వాటా పది శాతం.
రాష్ట్రాల ఆర్థిక పరిపుష్టికి కేంద్ర సహకారం అందుతోందా?
కేంద్ర విధానాల వలన రాష్ట్రాల ఆదాయం తగ్గుతోంది. 15వ ఆర్థిక సంఘానికి కేంద్రం నిర్ధేశించిన పరిశీలనాంశాలకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలను ఒకే తాటిపై తీసుకొచ్చేందుకుగాను ఇటీవల సమావేశం నిర్వహించాం. కేంద్రం ఇష్టారాజ్యంగా అమలు చేస్తున్న విధానాల వలన పన్నుల ద్వారా రాష్ట్రానికి సమకూరే ఆదాయం పడిపోతోంది. ఆర్థిక వనరులు దెబ్బతింటున్నాయి. జిఎస్‌టి వలన రాష్ట్ర ఆదాయం 9 శాతం పడిపోయింది. కేంద్రం ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోంది.
వివిధ వర్గాలకు సంక్షేమ పింఛన్లు ఇస్తున్నారు...?
-ఎల్‌డిఎఫ్‌ సర్కారు వచ్చాక 27 రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. వివిధ వర్గాలకు సంక్షేమ పింఛన్లను అమలు చేస్తున్నాం. నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు పింఛన్లు పంపుతున్నాం. వ్యవసాయ కార్మికులకు పింఛన్లు ఇవ్వడంతో పాటు ప్రతి ఏడాదీ పింఛను మొత్తాన్నీ పెంచుతున్నాం.
కేరళ ప్రవాసీ పెన్షన్‌ స్కీం గురించి వివరించండి...
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయుల సంక్షేమం కోసం ఈ పథకం ఉద్దేశించబడింది. ఈ పథకానికి రూపకల్పన చేయడానికి ముందు అన్ని దేశాల్లో ఉన్న కేరళీయులతో సంప్రదింపులు జరిపాం. దీనికి 'లోక కేరళ సభ' అని నామకరణం చేశాం. విదేశాల్లోని భారతీయుల ద్వారా జాతీయ, రాష్ట్ర ఖజానాకు ఆర్ధిక వనరులు సమకూరుతున్నాయి. ఈ వనరుల్ని రాష్ట్ర అభివృద్ధితో పాటు వ్యక్తిగత ఆర్ధిక భద్రతను కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. విదేశాల నుంచి ఆర్ధిక భారాలతో తిరిగి వచ్చిన వారికి ప్రభుత్వమే పెన్షన్‌ ఇస్తుంది. ఒకవేళ తాత్కాలికంగా పెన్షన్‌ వద్దనుకుంటే వారికి చెల్లించే సొమ్ముకు నిర్ణీత గడువు తర్వాత నాలుగురెట్లకు పెంచి ఏకమొత్తంగా అందించే వెసులుబాటు కూడా ఈ స్కీంలో ఉంది. దీనివల్ల కేరళీయులు ఎవరూ ఆర్ధికంగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండవు. ఈ స్కీంకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. విదేశాల నుంచి స్వరాష్ట్రానికి వచ్చాక వారి నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ ఇక్కడే ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
వివిధ అభివృద్ధి పథకాలకు నిధులను ఎలా సమకూరుస్తున్నారు?
- రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పన, సంక్షేమ పథకాలకు ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులు ఏ మాత్రం సరిపోవు. ఈ సవాలును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ బోర్డ్‌ (కెఐఐఎఫ్‌బీ)ను ఏర్పాటు చేశాం. ఐదేండ్లలో రూ.50వేల కోట్లు సమీకరించాలనేది లక్ష్యం. బడ్జెట్‌కు దీనికి సంబంధం లేదు. దీనిలో పెట్టుబడులు పెట్టేవారు తొలుత తమ ప్రాంతాల్లోని అభివృధ్ధి పనులను ఎంపిక చేసుకుంటారు. తర్వాతి క్రమంలో పెట్టుబడి మూలధనానికి వడ్డీని కూడా పొందే అవకాశం ఉంది. బోర్డుకు వచ్చే పెట్టుబడులకు రాష్ట్రప్రభుత్వం డిపాజిట్‌ గ్యారంటీ ఇస్తుంది. స్వీయ సంప్రదాయ వనరుల వినియోగం, సంక్షేమ ప్రమాణాల రూపకల్పన, నిర్వహణకు కేఐఐఎఫ్‌బీకి జవాబుదారీతనంతో కూడిన పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది.
బాలికలు, మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి?
- చరిత్రలో తొలిసారిగా మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వారి భద్రత, సంరక్షణకు దీర్ఘకాల ప్రణాళికల్ని అమలు చేస్తున్నాం. పింక్‌ పెట్రోల్‌ పేరుతో పట్టణాల్లో మహిళా సమస్యల పరిష్కారం, భద్రతను అందిస్తున్నాం. పోలీస్‌ ట్రాకింగ్‌ సిస్టం ఉంది. పెట్రోలింగ్‌ వాహనాలకు జీపీఎస్‌ సిస్టంను అనుసంధానం చేశాం. నిర్భయ 24/7 పేరుతో హెల్ప్‌డెస్క్‌, హెల్ప్‌లైన్‌ నెంబర్లు, జిల్లా మహిళా సెల్‌లో మహిళా సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లను నియమించాం. మహిళలు, బాలికల రక్షణకోసం రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యల్లో ఇవి కొన్ని మాత్రమే.
దేవాలయాల్లో దళిత పూజారులకు రిజర్వేషన్లు కల్పించారు...వాటి అనుభవాలు ఏంటి?
- సంప్రదాయ దేవాలయాల్లో దళిత పూజారులకు రిజర్వేషన్లు కల్పించాం. చారిత్రకంగా ఇదో ముందడుగు. ఒకప్పుడు దళితులకు ఆలయ ప్రవేశం కూడా లేకుండా ఉండేది. ఈ నిర్ణయాన్ని తొలుత కులాల ప్రాతిపదికగా హిందుత్వ శక్తులు, సంఫ్‌ుపరివార్‌ వంటి సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ క్రమేణా ప్రభుత్వ నిర్ణయాన్ని అవి కూడా స్వాగతించాల్సి వచ్చింది. సాంఘీక సంస్కరణల్లో ఇదే మైలురాయి.
దళితులు, ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి?
- శీఘ్ర నియామకాల పథకం క్రింద వందలాదిమంది ఆదివాసీ యువకుల్ని పోలీస్‌ ఫోర్స్‌ల్లో రిక్రూట్‌మెంట్‌ చేశాం. మారుమూల ప్రాంతాలు, చిట్టడువుల్లో నివసిస్తున్న గిరిజనుల కుటుంబాల్లోని యువకుల్ని తొలివిడతలో రిక్రూట్‌ చేశాం. ఆయా గిరిజన తాండాల్లోని యువతీ, యువకులు చదువుకొనేందుకు ఆర్ధిక సహాయాన్ని అందిస్తూ, విద్యుత్‌ సౌకర్యం కల్పించాం. వారి ఆసక్తిని బట్టి పక్కా గృహాలు, భూముల్ని కేటాయించాం.
వలస కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి?
- దేశంలోనే తొలిసారిగా వలస కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేశాం. ప్రదాన కేంద్రాల్లో షెల్టర్లు ఏర్పాటు చేసి, సేవల్ని అందిస్తున్నాం. వారందరికీ మెడికల్‌ అసిస్టెన్స్‌ స్కీంను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నాం.
కేరళ రాష్ట్రంలో కనీస వేతనం రూ.18 వేలు చెల్లిస్తున్నారా?
- కార్మికులకు కనీస వేతనాల నిర్ణయంపై చర్చలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దీన్ని కచ్చితంగా అమలు చేస్తున్నాం. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరింపచేస్తాం.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

హైదరాబాద్ మహాసభల చైతన్యం 1964 ను గుర్తు చేస్తుంది:విఎస్

మహాసభ స్ఫూర్తితో ముందుకు..

ఎర్ర సైన్యం

సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా ఏచూరి

జజ్జనకరి జనారే.. డప్పుల జాతరే..

ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వానికి సంఘీభావం

విద్యను వ్యాపారంగా మార్చేందుకు బీజేపీ యత్నం

పాలస్తీనాకు మద్దతుగా మహాసభ తీర్మానం

సీపీఐ(ఎం) నేతలు ఏం మాట్లాడారు ?

మోడీ కో హఠావ్‌ దేశ్‌ బచావ్‌...

నికరంగా పోరాడుతాం... నిజాయితీగా నిలదీస్తాం!

బీజేపీని ప్రజలే గద్దె దింపుతారు

సమయం, సవాల్‌ ప్రమాదకరంగా ఉంది

మహసభల్లో సంక్లిష్ట రాజకీయాలపై చర్చ

ఎర్రజెండాతోనే... తెలంగాణలో ప్రజారాజ్యం

ఎర్రజెండా అండనుండగా.. దండు నడపరా!

బీజేపీ సర్కార్ నేరస్థుల రక్షకులు : బృందా

తెలంగాణ వచ్చింది? ఏమిచ్చింది? : తమ్మినేని

మోడీ కలలు కనటం మానుకో : బృందాకరత్

తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం :తమ్మినేని వీరభద్రం

తెలంగాణ లో ఎర్రజెండా రాజ్యం రావాలి : తమ్మినేని వీరభద్రం

ఆర్ఎస్ ఎస్ కను సన్నల్లో బీజేపీ నడుస్తోంది : మాణిక్ స‌ర్కా‌ర్‌

బీజేపీవి మతతత్వ రాజకీయాలు : పినరాయి

సామాజిక భద్రత కోసం కేరళ ప్రభుత్వం పనిచేస్తోంది : కేరళ సీఎం పినరాయి

సీపీఐ(ఎం) భారీ బహిరంగ సభ లైవ్‌

మోడీని గద్దెనుండి దింపుతామని సీపీఎం వాగ్దానం : ఏచూరి

మళ్లీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు : సీతారాం ఏచూరి

బీ.వీ రాఘవులు అధ్యక్షతన పొలిట్ బ్యూరో 'రెడ్ సెల్యూట్' ..

సరూర్ నగర్ చేరుకున్న ఎర్ర కవాతు..

సభా ప్రాంగణానికి చేరుకున్న మాణిక్ సర్కార్, కేరళ సీఎం

సీపీఐ(ఎం) మహాసభకు పోటెత్తిన జనం..

సీపీఎం బహిరంగ సభ లైవ్‌

95 మందితో సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ (పూర్తి వివరాలు)

సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ‌లోకి నాగయ్య, కంట్రోల్ కమీషన్ లోకి జి రాములు

సీసీఎం బహిరంగ సభ...భారీ బందోబస్తు

ఉన్నత విద్యపై జరుగుతున్న దాడులపై సిపిఐ(ఎం) మహాసభ తీర్మానం

ఐదుగురు సభ్యులతో సిపిఐ(ఎం)కేంద్ర కంట్రోల్ కమీషన్

17మందితో సిపిఐ(ఎం)‌ పొలిట్ బ్యూరో వివరాలు..

సిపిఐ(ఎం) కేంద్రకమిటీ లోకి తెలంగాణ నుండి నలుగురు

17మందితో సిపిఐ(ఎం)‌ పొలిట్ బ్యూరో...

మహాసభలో అగ్రనేతలు ప్రసంగాలు

సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరీ ఏకగ్రీవం

95 మందితో సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

పాలస్తీనా సమస్యపై సిపిఐ(ఎం) మహాసభలో తీర్మానం

సీపీఎం కళాకారుల డప్పు ప్రదర్శన.. (ఫోటో గ్యాలరీ)

సిపిఐ(ఎం)‌ మహాసభల ప్రాంగాణంలో కళాకారుల కోలాహలం

సరూర్‌నగర్‌ స్టేడియంలో సీపీఎం భారీ బహిరంగ సభ

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి

సిపిఐ(ఎం) మహాసభలు - నవతెలంగాణ ప్రింట్(22 ఎప్రియల్) కవరేజ్

వికలాంగుల హక్కుల చట్టాల అమలుకు పోరాటం

మహిళా బిల్లుకు బీజేపీ ద్రోహం

నిన్న గోరక్షక్‌.. నేడు రేపిస్టు రక్షక్‌

కేరళ పాలన.. అన్నింటా ఆదర్శం

దేశానికి దశ, దిశ, నిర్దేశం

తీవ్రవాదం పీచమణిచాం

రుచికిరుచీ.. శుచికిశుచీ..

ప్రజల కోసమే పార్టీ

ఐక్య ఉద్యమాలతోనే..

జలియన్‌వాలాబాగ్‌కు నూరేండ్లు

బతుకుదెరువు

ఎస్సీ, ఎస్టీ‌ అట్రాసిటీ‌ చట్టం, దళితులపై దాడులపై సిపిఐ(ఎం)‌ తీర్మానం

జలియన్ వాలాబాగ్ స్మృతిలో సిపిఐ(ఎం)‌ మహాసభ తీర్మానం

ఎస్సీ, ఎస్టీ‌ అట్రాసిటీ‌ చట్టం, దళితులపై దాడులపై సిపిఐ(ఎం)‌ తీర్మానం

జలియన్ వాలాబాగ్ స్మృతిలో సిపిఐ(ఎం)‌ మహాసభ తీర్మానం

సిపిఐ(ఎం) రాజకీయ తీర్మానం పై స్పష్టతనిచ్చిన బృందాకారత్

సిపిఐ(ఎం)‌ మహాసభల్లో మూడు తీర్మానాలు ఆమోదం

సిపిఐ(ఎం)‌ బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర నాయకత్వం

బీజేపీని గద్దె దించటమే సీపీఎం ప్రధాన లక్ష్యం: బృందాకరత్

మాది మిస్డ్ కాల్ మెంబర్ షిప్ కాదు : బృందా కరత్

మహిళా హక్కుల తీర్మానానికి మహాసభ ఆమోదం : బృందకరత్

సిపిఐ(ఎం) మహాసభల్లో తెలంగాణ మహిళా ప్రతినిధులు

భారత సీపీఐ(ఎం) మహాసభలకు క్యూ‌బా కమ్యూనిస్టు పార్టీ సంఘీభావం

భారత సీపీఐ(ఎం) మహాసభలకు వెనిజులా కమ్యూనిస్టు పార్టీ సంఘీభావం

భారత సీపీఐ(ఎం) మహాసభలకు చైనా కమ్యూనిస్టు పార్టీ సంఘీభావం

కార్మిక హక్కులను హరించే నోటిఫికేషన్లు ఉపసంహరించాలి

సిరియాపై దురాక్రమణకు అమెరికా, నాటో బరితెగింపు

'మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌' ర్యాలీకి సీపీఐ (ఎం) మద్దతు

త్రిపురలో బీభత్సకాండను తిప్పికొట్టాలి

15వ ఆర్థిక సంఘ పరిశీలనాంశాలు సమాఖ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టు

సిపిఐ(ఎం) మహాసభలు - నవతెలంగాణ ప్రింట్(21 ఎప్రియల్) కవరేజ్

కాంగ్రెస్‌తో పొత్తు లేదు

సోషల్‌ మీడియాపై ఆంక్షలేల?

సిరియాపై దురాక్రమణకు అమెరికా, నాటో బరితెగింపు

కార్మికహక్కుల్ని కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం

విమర్శలోనూ హిందూ, పెత్తందారీ సంస్కృతి

15వ ఆర్థిక సంఘం విధి విధానాలు సమాఖ్య వ్యవస్థపై దాడి

'మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌' ర్యాలీకి సీపీఐ (ఎం) మద్దతు

The CPI(M) 22nd Congress adopted the main Political Resolution

ఏకగ్రీవంగా సిపిఐ(ఎం) రాజకీయ తీర్మానం ఆమోదం

మూడోరోజు సీపీఎం జాతీయ మహాసభలు (ఫోటో గ్యాలరీ)

సిపిఐ(ఎం) నిర్మాణ నివేదిక ప్రవేశపెట్టిన రామచంద్రన్ పిళ్లై

నిర్బంధాల్ని తట్టుకుని ముందుకు..

ప్రజలు శాంతి కోరుకుంటున్నారు:సిపిఐ(ఎం) కాశ్మీర్ కార్యదర్శి తరిగామి

సీపీఎం 22వ అఖిలభారత మహాసభలు (ఫోటో గ్యాలరీ)

బీజేపీని ఓడించేందుకు చర్యలు :కరత్

పార్టీలో విభేదాలున్నాయన్నది భ్రమే : ప్రకాశ్ కారత్

సీపీఎం జాతీయ మహాసభలు..కీలక అజెండా...

సిపిఐ(ఎం)‌మహాసభల్లో మూడవ రోజు తీర్మానాలు

మూడో రోజు కోనసాగుతున్న సీపీఎం జాతీయ మహసభలు (ఫోటో గ్యాలరీ)

అంతర్గత ప్రజాస్వామ్యమే మా బలం

ముసాయిదాకు రికార్డు స్థాయిలో సవరణలు

కిసాన్‌ లాంగ్‌మార్చ్‌ మహా స్ఫూర్తి

సాంస్కృతిక రంగంపై దృష్టి

నిర్బంధాల్ని తట్టుకుని ముందుకు..

ది కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌ మహారాష్ట్ర పుస్తకావిష్కరణ

ఎందులోనూ... గుజరాత్‌ మోడల్‌ కాదు

ప్రజలు శాంతి కోరుకుంటున్నారు

కమ్యూనిస్టు పార్టీల సంఘీభావం

పెచ్చరిల్లుతున్న లైంగిక హింస

బీజేపీ పాలనలో మరింత దాడులు : సుభాషిణి ఆలీ

సిపిఐ(ఎం) అఖిలభారత మహాసభలో థింసా కళాకారుల నృత్యం

కొనసాగుతున్న సిపిఎం జాతీయ మహాసభలు

జస్టీస్ లోయ కేసు దర్యాప్తు పై సిపిఐ(ఎం) మహాసభ తీర్మానం

జస్టీస్ లోయ కేసు దర్యాప్తు పై సిపిఐ(ఎం) మహాసభ తీర్మానం

సిపిఐ(ఎం)‌ మహాసభలలో రాజకీయ ముసాయిదాపై కొనసాగుతున్న చర్చలు

జస్టిస్ లోయా మృతిపై సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరం : ఏచూరి

ఎన్నికల పొత్తుపై స్పష్టతనిచ్చిన ఏచూరి

సిపిఐ(ఎం) మహాసభలు - నవతెలంగాణ ప్రింట్(19 ఎప్రియల్) కవరేజ్

రెండో రోజు కొనసాగుతున్న సిపిఎం జాతీయ మహాసభలు

పేదరికం నుంచి రాజకీయాల్లోకి..

రక్షణ లేని మోడీ ఏలుబడి

వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల బలోపేతమే ప్రత్యామ్నాయం

అమరవీరులకు నివాళి

ఉత్సాహ ప్రచారం.. ఊరూరా నినాదం

పెరిగిన మహిళా ప్రాతినిధ్యం

చరిత్రను తిరగరాసేది పోరాటాలే..

మక్కా మసీదు పేలుళ్ల కేసు తీర్పుపై సిపిఐ(ఎం)‌ మహాసభలో తీర్మానం

మక్కా మసీదు పేలుళ్ల కేసు తీర్పుపై సిపిఐ(ఎం)‌ మహాసభలో తీర్మానం

సిపిఐ(ఎం) రాజకీయ ముసాయిదా ప్రవేశపెట్టిన కారత్

బిజెపి పాలనలో పెరిగిన నియంతృత్వ దాడులు: ఏచూరి

మహాసభల్లో ఎమ్మెల్యే తరిగామి...

అమరవీరులకు సిపిఐ(ఎం)‌ అగ్ర నాయకత్వం నివాళి (చిత్రమాలిక)...

సిపిఐ(ఎం)‌ మహాసభల ప్రతినిధుల సభకు వివిధ కమిటీల ఎన్నిక

ప్రారంభమైన సిపిఐ(ఎం)‌ ప్రతినిధులసభ

సీపీఎం 22వ మహాసభలు (ఫోటో గ్యాలరీ)

రెండు కోట్ల ఉద్యోగాలేవి : జీఆర్ శివశంకర్

మహాసభల్లో సీపీఐ ఎంఎల్ నేత...

తెలంగాణ సాయుధ పోరాటం నేటికీ మాకు స్ఫూర్తి : బివి.రాఘవులు

సిపిఐ(ఎం) మహాసభల్లో అధ్యక్షోపన్యసం చేసిన మాణిక్ సర్కార్

కమ్మ్యూనిస్ట్ వెటరన్స్ ను సన్మానించిన సిపిఐ(ఎం) మహాసభ

లెఫ్ట్‌ ఐక్యత ఇప్పుడు అవసరం : సురవరం సుధాకర్‌

సిపిఐ(ఎం)‌ మహాసభల్లో అమరవీరులకు నివాళిగా కళకారులు

సీపీఎం మహాసభల్లో సందేశం వినిపిస్తున్న మనోజ్‌ భట్టాచార్య

సిపిఐ(ఎం) మహాసభల్లో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన మాణిక్ సర్కార్

కథువా వంటి ఘటనలు దురదృష్టకరం: సీతారాం ఏచూరీ

సిపిఐ(ఎం) మహాసభల్లో రాఘవులు స్వాగతోపన్యసం

సీపీఐ(ఎం) 22వ మహాసభలు (లైవ్‌)

సీపీఎం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన మల్లు స్వరాజ్యం

సిపిఎం మహాసభలు మరికొద్ది సేపట్లో...

నేటి నుంచి సీపీఐ (ఎం) మహాసభలు

మహాసభల్లో మతోన్మాదంపైనే రాజకీయ చర్చ

విస్తృతం...వినూత్నం

మహానగరం అరుణారుణం..

మహాసభలో మొత్తం 25 తీర్మానాలు..

ఆర్టీసీ కళ్యాణ మంటపం పరిసర ప్రాంతాలు అరుణవర్ణం

మహాసభలు-కార్యదర్శులు-కీలక నిర్ణయాలు

మహాసభ నిర్ణయాలు దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయి...

ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు..

సామాజిక న్యాయం..ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం..

మతోన్మాదం, ప్రపంచీకరణల బంధం వీడదీయరానిది

మతోన్మాదం, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఉధృత పోరాటాలు

ప్రజాపోరాటాలు ప్రతిబింబించేలా సీపీఐ(ఎం) మహాసభలు

వేగంగా సీపీఐ(ఎం) మహాసభ ఏర్పాట్లు

మహాసభల నేపథ్యంలో సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశం

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.