Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
స‌ర్వ‌స‌త్తా‌క, సామ్యవాద‌, లౌకిక ప్ర‌జాస్వా‌మ్య గ‌ణ‌తంత్రం మ‌న‌ది | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

స‌ర్వ‌స‌త్తా‌క, సామ్యవాద‌, లౌకిక ప్ర‌జాస్వా‌మ్య గ‌ణ‌తంత్రం మ‌న‌ది

Sun 23 Jan 11:31:13.476462 2022

రాజ్యాంగం రచించినప్పుడు పీఠిక 'సర్వసత్తాక, ప్రజాస్వామ్య గణతంత్ర
రాజ్యంగా' పేర్కొన్నారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా
సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను నూతనంగా చేర్చారు.
దీనితో పీఠిక 'సర్వ ఓసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య,
గణతంత్ర రాజ్యముగా' రూపొందింది. ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక,
రాజకీయ న్యాయం చేకూరాలని పీఠిక చెప్పింది. ప్రజలకు స్వేచ్ఛ
కల్పించడానికి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చారు. ప్రజలకు
సమానత్వం కల్పించడానికి రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను
పొందుపర్చారు. భారతదేశంలో రాజ్యాధినేత ఎన్నుకోబడడంతో దేశం
గణతంత్ర రాజ్యంగా రూపొందింది.
రాజ్యాంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా మౌలిక లక్షణాలైన లౌకిక విధానం, సమైక్య విధానం పార్లమెంటరీ ప్రజాసౌమ్యం, న్యాయశాఖ స్వతంత్రత మొదలైన వాటిపై పాలకులు దాడి చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్‌ఆర్‌సి, సిఎఎ, ఎన్‌పిఆర్‌లపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు అవశ్యకత ఏర్పడింది.
లిఖిత విఫుల రాజ్యాంగం
ప్రపంచంలో భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం పరిషత్‌ రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు తీసుకుంది. భారతదేశంలోని భిన్నత్వం, అన్ని తరగతుల ప్రయోజనాలు రక్షించాలనే దృక్పథం రాజ్యాంగంలో కనిపిస్తుంది. దళితులు, గిరిజనులు, ఇతర వెనకబడిన తరగతుల ప్రయోజనాల పరిరక్షణకు రాజ్యాంగంలో అనేక నిబంధనలను పొందుపర్చారు. అనేక విధులను నిర్వహించడానికి రాజ్యాంగ సంస్థలను ఏర్పాటు చేశారు. రాజ్యాంగం రచించినప్పుడు రాజ్యాంగంలో 395 నిబంధనలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు కలవు. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్‌ను 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పదో షెడ్యూల్‌ను, 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్‌ను, 1992లో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 12వ షెడ్యూల్‌ను చేర్చారు. వీటన్నింటి వల్ల భారత రాజ్యాంగం పరిమాణంలో పెద్దదిగా రూపొందింది.
రాజ్యాంగ పీఠిక
భారత రాజ్యాంగ లక్ష్యాలను పీఠికలో పొందుపర్చారు. పీఠికలోని 'భారతదేశ ప్రజలమైన మేము' అను వ్యాఖ్యానాన్ని ఐక్యరాజ్య సమితి రాజ్యాంగమైన చార్టర్‌ నుంచి గ్రహించారు. రాజ్యాంగం రచించినప్పుడు పీఠిక 'సర్వసత్తాక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా' పేర్కొన్నారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను నూతనంగా చేర్చారు. దీనితో పీఠిక 'సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా' రూపొందింది. ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం చేకూరాలని పీఠిక చెప్పింది. ప్రజలకు స్వేచ్ఛ కల్పించడానికి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చారు. ప్రజలకు సమానత్వం కల్పించడానికి రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపర్చారు. భారతదేశంలో రాజ్యాధినేత ఎన్నుకోబడడంతో దేశం గణతంత్ర రాజ్యంగా రూపొందింది. పౌరులకు మత స్వేచ్ఛను కల్పించడంతో లౌకిక రాజ్యంగా ఉంది. భారతదేశంలో అధికారానికి మూలాధారం ప్రజలు అని పీఠిక తెలిపింది.
రాజ్యాంగ మౌలిక స్వరూపం
భారత రాజ్యాంగంలో మౌలిక స్వరూపం గురించి పేర్కొనలేదు. కానీ, 1973లో కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని వివరించి, దాన్ని కాపాడుకోవాలని చెప్పింది. వివిధ కేసుల్లో జస్టిస్‌ సిక్రి, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ హెగ్డే మొదలైనవారి తీర్పులను పరిశీలిస్తే రాజ్యాంగ మౌలిక స్వరూప
లక్షణాలు తెలుస్తాయి. రాజ్యాంగ ఆధిక్యత, ప్రజాస్వామ్య సమాఖ్య విధానం, లౌకిక విధానం,
సమన్యాయం, సార్వభౌమాధికారం మొదలైనవాటిని మౌలిక లక్షణాలుగా పేర్కొన్నారు. మినర్వా మిల్స్‌ కేస్‌ (1980), వామన్‌రావ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (1981) కేసుల్లో కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూప ప్రాధాన్యతను తెలిపింది.
ప్రాథమిక హక్కులు
రాజ్యాంగం మూడోభాగంలో 12 నుంచి 35 వరకు గల నిబంధనల్లో ప్రాథమిక హక్కులను పొందుపర్చారు. భారత పౌరులకు స్వేచ్ఛను కల్పించడానికి ఈ హక్కులు దోహదపడతాయి. సుప్రీంకోర్టు 32వ నిబంధనల ద్వారా హైకోర్టు 226వ నిబంధన ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి ఐదు రకాల రిట్‌లు జారీ చేస్తాయి. ఆస్తి హక్కు వివాదం కావడంతో 1978లో 44వ రాజ్యాంగ సరవణ ద్వారా ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు. ప్రస్తుతం ఆస్తి హక్కు ఒక చట్టబద్ధమైన హక్కు మాత్రమే. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21-ఎ నిబంధన చేర్చి ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా పొందుపర్చారు. అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా సస్పెండ్‌ అవుతాయి.
ఆదేశిక సూత్రాలు
రాజ్యాంగం నాలుగో భాగంలో 36 నుంచి 51 వరకు గల నిబంధనల్లో ఆదేశిక సూత్రాలను పొందు పర్చారు. వీటిని ఐర్లాండ్‌ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఆదేశిక సూత్రాలు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా రూపొం దించడానికి తోడ్పడతాయి. భారత ప్రజల ఆర్థిక, సామాజిక, జీవన ప్రమాణాలు పెంపొందించడానికి ఆదేశిక సూత్రాలు అమలు చేయాలని రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వీటికి న్యాయస్థానాల సంరక్షణ ఉండదు. సంపద పంపిణీ, సమాన పనికి సమాన వేతనం, కార్మికులకు సౌకర్యాలు మొదలైన అనేక అంశాలను ఆదేశిక సూత్రాల్లో పొందుపర్చారు. అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు, తమ రాజకీయ సిద్ధాంతాలతో నిమిత్తం లేకుండా సూత్రాలు అమలుచేయాల్సి ఉంటుంది.
ప్రాథమిక విధులు
రాజ్యాంగ రచనా సమయంలో ప్రాథమిక విధులు రాజ్యాంగంలో లేవు. స్వర్ణసింగ్‌ కమిటీ సిఫార్సుల ఆధారంగా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొక ప్రాథమిక విధిని జతచేశారు. ఇప్పుడు రాజ్యాంగంలో 11 ప్రాథమిక విధులున్నాయి. రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం, హింసను విడనాడటం ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించు కోవడం వంటి అంశాలు ప్రాథమిక విధుల్లో ఉన్నాయి. భారత పౌరుల్లో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందించు ఆశయంతో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు.
పార్లమెంటరీ ప్రభుత్వం
భారత రాజ్యాంగం దేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి నాయకత్వాన గల మంత్రి మండలి నిజమైన అధికారాలను కలిగి ఉంటుంది. రాజ్యాధినేత అయిన రాష్ట్రపతి నామమాత్ర అధికారాలను కలిగి ఉంటాడు. కేంద్రంలోను, రాష్ట్రంలోనూ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కొన సాగుతుంది. సమిష్టి బాధ్యత, కార్యనిర్వాహక వర్గం, శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించడం పార్లమెంటరీ విధానం యొక్క ముఖ్య లక్షణాలు. అయితే, బ్రిటిష్‌ తరహా పార్లమెంటరీ ప్రభుత్వాన్ని భారతదేశం స్వీకరించలేదు. బ్రిటన్‌లో ఇప్పటికీ వారసత్వ రాజరికం కొనసాగుతుంది. కానీ, భారతదేశం తనకుతాను గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంది.
స్వతంత్ర న్యాయవ్యవస్థ
భారతరాజ్యాంగం దేశంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. న్యాయ వ్యవస్థ ఏకీకృత న్యాయ వ్యవస్థగా ఉంటుంది. రాజ్యాంగంలో చెప్పన ప్పటికీ న్యాయవ్యవస్థ న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంది. గత నాలుగు దశాబ్దాలుగా న్యాయ వ్యవస్థ క్రియాశీలత కొనసాగు తోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో సహా 31 మంది న్యాయమూర్తులు కొనసాగు తున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 25 హైకోర్టులు ఏర్పడి పనిచేస్తున్నాయి. న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం వ్యవస్థ ఏర్పడింది. జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్‌ను 99వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏర్పాటు చేసినప్పటికీ సుప్రీంకోర్టు ఆ సవరణను కొట్టివేసింది. దేశంలో పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడడంలో న్యాయవ్యవస్థ క్రియాశీలక పాత్ర వహిస్తుంది. ఇటీవల కాలంలో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం ప్రాధాన్యత పొందింది.
సమాఖ్య ఏకకేంద్ర లక్షణాలు
రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని సమాఖ్య, ఏకకేంద్ర లక్షణాల సమ్మేళనంగా రూపొందించారు. సమాఖ్య లక్షణాలైన లిఖిత రాజ్యాంగం, అధికార విభజన, ద్విసభా విధానం, స్వతంత్ర న్యాయశాఖ మొదలైనవి భారత రాజ్యాంగంలో ఉన్నప్పటికీ ఇది పూర్తి సమాఖ్య కాదు. సమాఖ్యను అధిగమించే ఏకకేంద్ర లక్షణాలు బలంగా ఉన్నాయి. అందువల్లే డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ భారతదేశాన్ని ఏకకేంద్ర స్ఫూర్తితో పనిచేస్తున్న సమాఖ్య రాజ్యంగా వర్ణించారు. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు కె.సి.వేర్‌ భారతదేశాన్ని 'అర్ధ సమాఖ్య' అని వర్ణించాడు. ఏకకేంద్ర లక్షణాలైన ఒకే పౌరసత్వం, ఏకీకృత న్యాయవ్యవస్థ, అఖిల భారత సర్వీసులు పాత్ర, కేంద్ర అధిక్యత మొదలైనవి కూడా రాజ్యాంగంలో ఉన్నాయి.
వయోజన ఓటు హక్కు
భారత రాజ్యాంగం పౌరులందరికీ సార్వజనీన ఓటు హక్కును ప్రసాదించింది. రాజ్యాంగ రచనా సమయంలో 21 సంవత్సరాలు నిండిన స్త్రీ, పురుషులందరికీ కుల, మత, వర్గ, లింగ, జాతి భేదాలు లేకుండా ఓటు హక్కు సార్వత్రికంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ప్రతిపాదించారు. అయితే, 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 ఏండ్లకు తగ్గించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ విజయం సాధించడంలో ఓటు హక్కు ముఖ్యపాత్ర పోషించింది. గత 17 సాధారణ ఎన్నికల్లో భారత ప్రజలు తమకుగల ఓటు హక్కును విజయవంతంగా వినియోగిం చుకున్నారు. 16వ సాధారణ ఎన్నికల్లో 83 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కను కలిగి ఉండటం ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక అపూర్వమైన విషయం. రాజ్యాంగ నిర్మాతలు ప్రజలందరికీ ఓటు హక్కు ఇవ్వడం ద్వారా ప్రజా సార్వభౌమాధికారం కొనసాగుతుందని విశ్వసించారు.
దృఢ, అదృఢ రాజ్యాంగం
భారత రాజ్యాంగం దృఢ, అదృఢ
రాజ్యాంగ లక్షణాలను కలిగి ఉంది. రాజ్యాంగంలో 18వ భాగంలో 368వ నిబంధనల ద్వారా రాజ్యాంగ సవరణ జరుగుతుంది. కొన్ని అంశాలను సవరించడానికి అమెరికా వలె దృఢమైన పద్ధతి అనుసరిస్తారు. ఉదాహరణకు రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు వంటి అంశాలను సవరించడానికి దృఢమైన పద్ధతిలో సవరణ చేస్తారు. కొన్ని అంశాలను బ్రిటన్‌ వలె అదృఢమైన పద్ధతిలో సవరిస్తారు. రాష్ట్రాలు ఏర్పాటు, రాష్ట్రాల పేర్లు మార్పు, దళితులు, గిరిజనుల పాలనకు సంబంధించిన అంశాలు అదృఢమైన పద్ధతిలో సవరి స్తారు. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు మొదలైన వాటిని సవరించడానికి దృఢ, అదృఢ పద్ధతిని అనుసరిస్తారు.
స్థానిక సంస్థలు
రాజకీయ వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యమని మహాత్మా గాంధీతో సహా అనేకమంది అభిప్రాయ పడ్డారు. రాజ్యాంగ రచనా సమయంలో స్థానిక సంస్థల గురించి కేవలం ఆదేశిక సూత్రాల్లో మాత్రమే పేర్కొన్నారు. బల్వంతరారు మెహతా కమిటీ మొదలైన వాటి సిఫార్సుల ద్వారా దేశంలో పంచాయితీరాజ్‌ సంస్థలను ఏర్పాటు చేశారు. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీరాజ్‌ సంస్థలకు, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపల్‌ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించారు. రాజ్యాంగంలో 11వ షెడ్యూల్‌ ద్వారా గ్రామ పంచాయితీలకు 29 అంశాలపై, 12వ షెడ్యూల్‌ ద్వారా మున్సిపల్‌ సంస్థలకు 18 అంశాలపై అధికారాలు కల్పించారు.
అణచివేతకు గురైన వర్గాలు
భారత సమాజంలో చారిత్రకంగా అణచివేతకు గురైన షెడ్యూల్‌ తెగలు, వెనకబడిన తరగతుల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో అనేక రక్షణలు, రిజర్వేషన్లు కల్పించారు. రాజ్యాంగం 16వ భాగంలో ఈ వర్గాల కోసం కొన్ని ప్రత్యేక నిబంధనలు చేర్చారు. రాజ్యాంగం 5, 6 షెడ్యూళ్లలో గిరిజనుల కోసం, వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక నిబంధనలు చేర్చారు. మండల కమీషన్‌ నివేదిక అమలులో భాగంగా వెనకబడిన తరగతులకు జాతీయ స్థాయిలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఈ వర్గాల రక్షణ కోసం జాతీయ ఎస్‌సి కమిషన్‌, జాతీయ ఎస్‌టి కమిషన్‌, జాతీయ బిసి కమిషన్‌, జాతీయ మహిళా కమిషన్‌, జాతీయ మైనార్టీ కమిషన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ మొదలైన వాటిని ఏర్పాటు చేశారు. వీటిల్లో కొన్ని కమిషన్లకు రాజ్యాంగ పరమైన హోదా కల్పించారు.
రాజ్యాంగం - పాలకులు
రాజ్యాంగ రచన ముగిసిన సమయంలో డాక్టర్‌ అంబేద్కర్‌ వ్యాఖ్యానిస్తూ 'రాజ్యాంగం మంచిదైనప్పటికి అది అమలు చేసే పాలనలపై ఫలితాలు ఆధారపడి ఉంటాయని' చెప్పారు. గత 70 ఏండ్లుగా రాజ్యాంగం అమలులో పాలకులు విఫలమయ్యారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం సాధనలో వైఫల్యం కనబడుతుంది. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు సక్రమంగా అమలు జరగదు. అత్యవసర పరిస్థితిలో 1975లో ఎదురైన సవాలును ప్రజలే పాలకులకు బుద్ధి చెప్పడం ద్వారా అధిగమించారు. ప్రస్తుతం రాజ్యాంగ మౌలిక భావాలకే ముప్పు ఏర్పడిన నేపథ్యంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాలపై ఉంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సెలవులందు వేసవి సెలవులు వేరయా!!
మనసు కవి.. మన సుకవి.. ఆచార్య ఆత్రేయ
కామ్రేడ్‌ మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
రంజాన్‌ - రోజా - జకాత్‌
ఎండాకాలం - జాగ్రత్తలు
సంఘటిత శక్తి..అంకాపూర్‌
అరుణోద్యమ కెరటం మా మల్లు స్వరాజ్యం
మనుగడ కోల్పోతున్న మానవుని ఆదిమ ఆవాసాలు
యుద్ధాలకు అడ్డుకట్ట వేయాల్సిందే...
సవాళ్ల ముళ్ళపై ఆగని ఆమె పయనం!

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
06:43 PM

జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ

06:23 PM

వాళ్లతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తులు ఉండ‌వు: కేఏ పాల్

06:02 PM

ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ కోసం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన ఒప్పో

05:59 PM

లండ‌న్‌లో రాహుల్ గాంధీ..

05:44 PM

హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

05:42 PM

ఏపీలో విషాదం..రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి..

05:26 PM

పద చూస్కుందాం కమల్ 'విక్రమ్' తెలుగు ట్రైలర్..

05:06 PM

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..

04:50 PM

జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌న నిమిత్తం ఢిల్లీ బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

04:29 PM

రేప‌టి నుండి పదోతరగతి పరీక్షలు..విద్యార్థుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

03:46 PM

అలాంటి గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడు : దివ్యవాణి

03:24 PM

జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే ఆజంఖాన్‌

03:04 PM

దిశ ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో ముగిసిన విచారణ..ఎన్ కౌంటర్ బూటకం

02:40 PM

పోలీసు ఉద్యోగార్థుల‌కు కేసీఆర్ గుడ్ న్యూస్

02:26 PM

లారీని ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్.. 9 మంది సజీవ దహనం

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.