Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ధరల రుతువు | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • అంతరంగం
  • ➲
  • స్టోరి

ధరల రుతువు

Sun 03 Apr 05:14:47.403712 2022

        ఎన్నికల రుతువు ముగియగానే ఆరంభమయ్యే రుతువు ధరల రుతువే. ఆకాశంలోని చుక్కలను కూడా దాటిపోతున్న ధరలు. వీటికి అంతం లేదు. అదుపూ లేదు. మొన్నటి వరకూ అంటే, వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నపుడు, ఒక మూడు నెలల కాలంలో దేని ధరా పెరగనే లేదు. ఎన్నికలు ముగిసిన నాటి నుండి ఈ పెరగటం మొదలయింది. ఇక సామాన్యులు ''ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులో నాగన్న, ధరల మీద ధరలు పెరిగె నాగులో నాగన్న, ధరల మీద మన్ను బొయ్య నాగులో నాగన్న'' అంటూ ఎన్నో యేండ్లుగా పాడుకొంటున్న పాటనే పాడుకోవాల్సి వస్తోంది.
        ధరల పెరుగుదల గురించి రాజకీయులు మాట్లాడే మాటలు అటుంచి, సామాన్యుల బాధలను గమనించాల్సిన అవసరం వుంది. ఈ రోజు ప్రతిపక్షంలో వున్నవాళ్లు ధర్నాలు చేస్తూ ధరలపై గొడవ చేయొచ్చుగాక, వాళ్లు అధికారంలో వున్నపుడు ఇలానే ధరలను పెంచుతూ పోయారనేది గమనించాలి. ఇప్పుడు అధికారంలో వున్న వాళ్లు ఆనాడు పది, పదిహేను రూపాయలు గ్యాసు ధర పెరిగినపుడు పెద్ద పోరాటానికి పిలుపునిచ్చారు. ఇపుడు మంత్రులుగా వున్న మహిళలు రోడ్డెక్కి ప్రజల కష్టాల గురించి తెగ బాధ పడిపోయిన వారే. మరి ఇపుడు వాళ్ళకు ఏ ప్రజలూ గుర్తుకురావటం లేదు. అసలు ధరలపై వాళ్లు మాట్లాడటమే లేదు.
        గ్యాసు ధర వేయి దాటి పోయింది. పెట్రోలు, డీజిలు వంద దాటి పైకి ఎగబాకుతూనే వుంది. ఈ ధరల పెరుగుదల వీటికి మాత్రమే పరిమితమయి వుండదు. పెట్రోలు, డీజిలు రవాణా రంగ ఖర్చులను పెంచేస్తాయి. దీంతో అన్ని సరుకులు, కూరగాయలు, రవాణా మొత్తం చెట్టెక్కి కూర్చుంటాయి. అంతేకాదు ఇప్పుడు రైతులు వాడే ఎరువులు, పురుగు మందులు విపరీతంగా పెంచేశారు. అందువల్ల రైతు పెట్టాల్సిన పెట్టుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. అప్పులలో రైతు కూరుకుపోయే పరిస్థితి వస్తోంది. ఏదో ఆర్నేల్లకో, సంవత్సరానికో ఒక సారి పెరిగి ఊరుకుంటాయి అని కాదు, ప్రతి రోజూ పెరుగుతూ పోవటం ఇప్పటి ధరల నైజం. ధరలిప్పుడు ప్రభుత్వాల చేతిలో ఏమీ లేవు అని కొందరు వాదిస్తుంటారు. ముఖ్యంగా పెట్రోలు, డీజిలు లాంటి అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుంటే వాటికనుగుణంగా ఇక్కడా పెరుగుతాయి అంటారు. నిజమే మరి అక్కడ తగ్గినపుడు, ఇక్కడ తగ్గాయా మరి! పోనీ ఎన్నికలపుడు ఎందుకు పెరగలేదు! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వారి ఆదాయాన్ని పెంచుకోవటానికి పన్నులు వేసి ప్రజల పీల్చి పిప్పి చేస్తున్నారు. ఎవరూ దేనికి మినహాయింపు కాదు. ఒక్క కేరళ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం, ప్రజలు భరించలేరని చమురు ధరలు తగ్గించి, అంటే ప్రభుత్వ పన్ను తగ్గించి, తన ఔదార్యాన్ని చాటుకున్నది.
        ఇక ఇప్పుడు అనారోగ్యాలతో కునారిల్లే పేదలు, సామాన్యులు వాడే ఔషధాల ధరలనూ పెంచేశారు. జ్వరానికి వేసుకునే పారాసెటమోల్‌ గోలీ బిళ్లల ధరలనూ పెంచి, ప్రయివేటు ఫార్మా కంపెనీల లాభాలు పెంచేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ సామాన్యులు అనారోగ్యం పాలయితే వారు పడే కష్టాల గురించి ఆలోచించలేకపోయారు. విద్యను ప్రయివేటు పరం చేసి పేదలకు దూరం చేస్తున్నారు. వైద్యాన్ని వ్యాపారం చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్తు ఛార్జీలు పెంచింది. వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపింది. ఇది దారుణమైన విషయం.
        పోనీ ధరలు పెరుగుతున్న సందర్భంలో కార్మికులు, ఉద్యోగుల ఆదాయాలు ఏమైనా పెరుగుతున్నాయా అంటే అదేమీ లేదు. కనీస వేతనాలు కూడా అందని శ్రామికులు దేశంలో లక్షలాది మంది వున్నారు. ఒక వైపు పరిశ్రమలు మూతపడి, ఉద్యోగాలు కోల్పోయి ఆదాయాలు లేని సైన్యం పెరుగుతోంది. ఇంకోవైపు ఈ ధరాఘాతాలు. మధ్య తరగతి ప్రజలు ఆదాయాలు కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. 'మేం ధరలు పెంచుతూనే వుంటాము. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకుంటూ కాలం గడపాలని' అధినాయకులు సుద్ధులు చెబుతున్నారు. వ్యాపారుల లాభాలకు కాపుకాసే నాయకులు ఉన్నంత కాలం మోసం జరుగుతూనే వుంటుంది. ఓటు వేసే సమయాన మనం సరయిన నిర్ణయం తీసుకుని, దాన్ని ఆయుధం చేసుకుంటేనే జనం బాధలు వాళ్ళకు తెలిసొస్తాయి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బడిపాట్లు
నాన్న
చే జీవితం యువతకు ఉత్తేజం!
అందాల కాశ్మీరు..!
ఏమిటీ ఉన్మాదం!
నిఖత్‌ భారత్‌ మహాన్‌
తిండిగలిగితె...
ఏం సమాజమిది!
భాషకు ద్వేషం లేదు
దారి మళ్ళింపు

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:56 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుదల

09:51 PM

మ‌హారాష్ట్ర సీఎం రాజీనామా

09:48 PM

దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ చేస్తారు మోడీ: కేటీఆర్

09:35 PM

పెట్రోల్ పోసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

09:27 PM

సిద్దిపేట గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్

09:11 PM

ముంబైకు నూతన పోలీస్ క‌మిష‌న‌ర్‌ నియామకం

09:07 PM

తెలంగాణలో రేపు పాలిసెట్

08:51 PM

అలవోకగా తెలుగు చదివేస్తున్న అమెరికా అమ్మాయి

08:36 PM

భావోద్వేగానికి గురైన ఉద్ధ‌వ్ థాక‌రే..!

08:30 PM

హైదరాబాద్‌లో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టి‌వేత‌

08:14 PM

రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించాలి : నిరంజన్ రెడ్డి

07:53 PM

ఢిల్లీలో ఆ వాహనాలపై నిషేధం..!

07:48 PM

ఆర్ఆర్ఆర్ సినిమాకు అరుదైన గౌరవం

07:29 PM

మ‌హారాష్ట్రలో 2 నగరాలు, ఎయిర్ పోర్టు పేరు మార్పు

07:26 PM

న‌టి స్వ‌ర భాస్క‌ర్‌కు బెదిరింపు లేఖ‌

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.